విజయనగరం జిల్లా తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన ఐదు సంవత్సరాల బాలుడు ఇంటివద్ద ఆడుకుంటూ 5 రూపాయల నాణెం మింగేసాడు.అది గొంతులో ఇరుక్కుపోవడం తో విలవిలఆడాడు .
తీవ్రంగా ఏడుస్తూ బాలుడు అస్వస్థతకు గురవ్వటంతో.హుటాహుటిన తల్లిదండ్రులు రాజాం పట్టణంలోని ఆరోగ్య హాస్పిటల్ కి తరలించారు వైద్యుడు సుంకర రఘు ఎక్స్రే తీయించగా.
అన్నవాహికలో నాణెం ఉన్నట్లు గుర్తించి.ఎండోస్కోపి విధానం ద్వారా బయటకు తీశారు.దీంతో బాలుడి తల్లిదండ్రులు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.







