సాధారణంగా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత హీరో హీరోయిన్లు సక్సెస్ మీట్ లో పాల్గొంటూ ఉంటారు.అదేవిధంగా సినిమా సక్సెస్ అయినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ ఎన్నో విషయాలను మీడియాతో పంచుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే హీరో హీరోయిన్లు అప్పుడప్పుడు కొన్నిసార్లు మ్యాగజైన్ కోసం ఫోటోషూట్స్ కూడా చేస్తూ ఉంటారు.ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో పాటు అంతకుమించి హీరో హీరోయిన్ ల మధ్య ఏం జరిగినా కూడా అది వివాదాలకు దారి తీస్తూ ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా బాలీవుడ్ హీర వరుణ్ ధావన్, హీరోయిన్ కియారా అద్వానీల మధ్య జరిగిన ఓ మ్యాగజైన్ ఫోటోషూట్ వివాదానికీ దారి తీసింది.
కాగా ఇటీవలే వరుణ్ దావన్,కియారా అద్వానీ జంటగా జుగ్ జుగ్ జియో అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదల అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకుంది.అలాగే ఆన్ స్క్రీన్ పై వీరిద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడంతో సినిమా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.అయితే ఈ సినిమా హిట్ అయిన సందర్బంగా ఈ జంట సక్సెస్ మీట్స్ లో పాల్గొన్నారు.
అయితే మామూలుగా సినిమాలో సన్నివేశాన్ని బట్టి హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ అన్నది సహజంగా ఉంటుంది.కానీ సినిమా అయిపోయిన తర్వాత కూడా ఒక ఫోటో షూట్ లో పాల్గొన్నారు కియారా, వరుణ్.
ఇక ఆ ఫోటో షూట్ లో భాగంగా ఇద్దరూ కలిసి క్లోజప్ గా ఫోటోలకు బాగానే ఫోజులిచ్చారు.
ఈ క్రమంలోనే మధ్యలో వరుణ్ ధావన్ కాస్త మరింత చొరవ తీసుకొని కియారా బుగ్గపై ముద్దు పెట్టేసాడు.వరుణ్ ముద్దు పెట్టగానే వెంటనే కియారా వరుణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో పై స్పందించిన నెటిజన్స్ సినిమా అయిపోయిన తర్వాత కూడా ఈ ముద్దుల వ్యవహారం ఏంటి ఇకపైన చాలించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొందరు వరుణ్ ధావన్ నీకు ఆల్రెడీ పెళ్లి అయింది ఆ విషయం గుర్తుకు ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.