టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ మనస్సులో ఏం అనుకుంటే అదే మాట్లాడతారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.అఖండ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో ఆ సినిమాను మించిన విజయాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.
రవీంద్రభారతిలో సి నారాయణ రెడ్డి 91వ జయంతి వేడుకలు జరగగా బాలయ్య ఈ వేడుకలలో బాలయ్య పాల్గొన్నారు.మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ కార్యక్రమానికి గెస్ట్ గా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో బాలయ్యకు జీవిత సాఫల్య స్వర్ణ కంకణంను ప్రధానం చేశారు.సాహిత్యాన్ని బ్రతికించిన వాళ్లలో సి.
నారాయణ రెడ్డి ప్రథములని బాలయ్య అన్నారు.తనలో ఉన్న నటుడిని గుర్తించి సీనియర్ ఎన్టీఆర్ కు చెప్పిన వ్యక్తి సి.నారాయణ రెడ్డి అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.సీనియర్ ఎన్టీఅర్ కు ఉన్న మంచి స్నేహితులలో సి.నారాయణ రెడ్డి ఒకరని ఆయన వెల్లడించారు.
సి.
నారాయణరెడ్డి మా కుటుంబంలో ఒకరని బాలయ్య అన్నారు.సి.నారాయణ రెడ్డి ఆశీస్సులతో భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలలో నటించి మెప్పిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.సి.నారాయణ రెడ్డి జీవిత సాఫల్య స్వర్ణ కంకణంను స్వీకరించడం సంతోషంగా ఉందని ఆయన కామెంట్లు చేశారు.బాలకృష్ణ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

షూటింగ్ ల బంద్ నేపథ్యంలో బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ షూట్ వాయిదా పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ 2023 సంవత్సరం జనవరిలో విడుదల కానుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కూడా ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.








