ఇషా చావ్లా.టాలీవుడ్ లో ఒకప్పుడు సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగింది.
కొద్ది కాలం పాటు పలు హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తొలుత డైరెక్టర్ విజయ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమ కావాలి సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
సాయి కుమార్ నట వారసుడు ఆది హీరోగా పరిచయం అయిన ఈ సినిమాతోనే తను కూడా తెలుగు తెరకు పరిచయం అయ్యింది.తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది ఈ క్యూట్ బ్యూటీ.
ఈ సినిమా సక్సెస్ తో ఆమెకు తెలుగులో పలు ఆఫర్లు వచ్చాయి.వరుస బెట్టి సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత నెమ్మదిగా తనకు అవకాశాలు రావడం ఆగిపోయాయి.కొంత కాలం తర్వాత తెలుగు తెరకు దూరం అయ్యింది.
అయితే ఈమె తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది.తన కెరీర్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తన అభిమానులతో పంచుకుంటుంది.
ఇంతకీ తను చెప్పిన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సునీల్ హీరోగా వచ్చిన పూలరంగడు సినిమాలో ఇషా చావ్లా హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా తనకు మంచి పేరు తెచ్చింది.ఆ తర్వాత శ్రీమన్నారాయణ, మిస్టర్ పెళ్లి కొడుకు, జంప్ జిలాని, రంభ ఊర్వశి, మేనక సినిమాలు చేసినా తన కెరీర్ కు అంతగా ఉపయోగపడలేదు.
తెలుగు, కన్నడ భాషల్లో ఏడు సినిమాలు చేసింది.
అయితే ఇందులో కేవలం రెండు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి.కథల విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం మూలంగానే తను కెరీర్ ను నాశనం చేసుకుంది.ఈ దెబ్బకు టాలీవుడ్ నుంచి ఔట్ అయ్యింది.
అయితే తను సినిమాలకు దూరం కావడం వెనుక మరోకారణం ఉందనే వార్తలు వచ్చాయి.తను సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడం వల్లే సినిమాలు మానేసిందని టాక్ వినిపించింది.
ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.