సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విచిత్రాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.ఒక హీరోయిన్ వదులుకున్న సినిమాలలో మరో హీరోయిన్ నటించి సక్సెస్ సాధించిన సందర్భాలు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగానే ఉన్నాయి.
మహేష్ బాబు సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఒక్కడు సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.గుణశేఖర్ డైరెక్షన్ లో ఎం.ఎస్.రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
7 డేస్ 6 నైట్స్ ప్రమోషన్స్ లో భాగంగా ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ మనసంతా నువ్వే మూవీకి ముందు భూమికను హీరోయిన్ గా అనుకున్నామని భూమికకు మనసంతా నువ్వే, ఒక్కడు కథలు చెప్పగా ఒక్కడు నచ్చిందని రీమాసేన్ కు కూడా రెండు కథలు చెప్పగా మనసంతా నువ్వే నచ్చిందని ఎం.ఎస్.రాజు వెల్లడించారు.ఆ విధంగా ఒక్కడు మూవీలో రీమాసేన్, మనసంతా నువ్వేలో భూమిక ఛాన్స్ కోల్పోయినట్టు ఎం.ఎస్.రాజు చెప్పుకొచ్చారు.
అయితే ఒక్కడు సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఖుషి, సింహాద్రి, ఒక్కడు సినిమాల విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో భూమిక రేంజ్ మారిపోయింది.ముగ్గురు స్టార్ హీరోల సక్సెస్ ఫుల్ సినిమాలలో ఈ నటి హీరోయిన్ గా నటించారు.ఈ సినిమాలు ఆయా హీరోలకు 7వ సినిమాలు కావడం గమనార్హం.
లక్కీ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్నా వరుస ఆఫర్లను సాధించడంలో భూమిక ఫెయిలయ్యారు.
భూమిక వరుసగా ఆఫర్లను సొంతం చేసుకున్నా కెరీర్ విషయంలో మాత్రం తప్పటడుగులు వేశారు.ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో చేసిన పొరపాట్ల వల్ల భూమిక ఎక్కువ కాలం కెరీర్ ను కొనసాగించలేదు.భూమిక ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా ఆ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు.
భూమిక ప్రస్తుతం అక్క, వదిన తరహా పాత్రల్లో నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.