చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థి అయిన రాజశేఖర్ తొలిసారి భారతీరాజా దర్శకత్వం వహించిన నిగల్గల్ (1980) చిత్రంలో నటించారు.ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్ రాబర్ట్ సహచర్యంతో దర్శకుడిగా మారారు.
ఒరు తాలై రాగం, మనసుక్కుల్ మతప్పు వంటి చిత్రాలు ఈ కాంబినేషన్కు మంచి పేరు తెచ్చాయి.రెండేళ్ల క్రితం రాబర్ట్ కన్నుమూశారు.
దీంతో రాజశేఖర్ మళ్లీ నటన వైపు వచ్చారు.రాజశేఖర్ దర్శకుడిగా తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.
పలైవనచోలై, చిన్నపూవే మెల్ల పెసు తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.కాగా విక్రమ్ సినిమా చూస్తుండగా చాల మందికి డైరెక్టర్ రాజశేఖర్ గుర్తొచ్చారు.
ఆ రోజుల్లో అంటే ఎయిటీస్ లో రజనీకాంత్ కమల్ హసన్ లతో వరసగా సూపర్ హిట్ కమర్షియల్ సినిమాలు రూపొందించిన రాజశేఖర్ గురించి ఎవరూ మాట్లాడడం లేదేంటబ్బా అనిపించింది.మెగాస్టార్ చిరంజీవికి గొప్ప పేరు తెచ్చిన పున్నమినాగు సినిమా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందినదే.
అప్పటికి దక్షిణ భారతంలో అత్యధిక బడ్జెట్ కోటి రూపాయల వ్యయంతో రూపొందిన ఏజెంట్ విక్రమ్ అనే కమల్ హసన్ సినిమా కూడా ఈ డైరెక్ట్ చేసినదే.
రాజశేఖర్ డైరెక్షన్ లో కమల్ హసన్ నటించిన సూపర్ హిట్ తమిళ సినిమాలను ఏడిద రాజా తదితరులు తెలుగులో డబ్ చేసి హిట్స్ కొట్టేవారు.
అదో తరహా పూనకం సినిమాలు తీసిన రామనారాయణ తదితరులతో కల్సి రచనలు చేసేవారాయన.హున్నిమేయ రథరియల్లి అనే కన్నడ సినిమా ద్వారా రాజశేఖర్ డైరెక్టర్ అయ్యారు.అంతేకాదు అదే సినిమాను తెలుగులో పున్నమినాగుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అదే సినిమా హిందీలో మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రలో జీనేకీ అర్జూ అనే పేరుతో వచ్చింది.
దానికీ రాజశేఖరే డైరెక్టర్ గా వ్యవహరించటం జరిగింది.అయితే 82 లో ఎవిఎమ్ వారికి అమ్మ అనే టైటిల్ తో ఆయన చేసిన సినిమా విజయం సాదించలేకపోయింది.
అయితే మలయూర్ మొబత్తియాన్ అనే సినిమా 83లో వచ్చి తమిళ్ లో తొలి హిట్ ను అనుకుంది.కాగా ఆ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు.
ఆ తర్వాత రాజశేఖర్ సినిమాలకు దాదాపుగా రాజానే సంగీత దర్శకుడుగా చేశారు.అయినా ఈయన తీసిన సినిమాలలో విజయ్ కాంత్ కు కూడా కూలీకారన్ లాంటి సక్సస్సులు ఇచ్చారు.
రాజశేఖర్ చివరి సినిమా ధర్మ దొరై ఆ సినిమాలో రజనీకాంత్ హీరో గా చేయగా ఆ సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది.ఆ సినిమాకు సంబంధించిన వేడుకలకు హాజరై వస్తూండగానే కార్ యాక్సిడెంట్ అయి కన్నుమూశారు రాజశేఖర్.
అయితే 91 లో ఆయన కన్నుమూయడానికన్నా రెండేళ్ల ముందు వచ్చిన రాజశేఖర్ తెలుగు సినిమా బామ్మమాట బంగారుబాటలో కూడా సూపర్ కార్ యాక్సిడెంట్ అయ్యి నూతన్ ప్రసాద్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది.అదే తరహాలో రాజశేఖర్ మరణించటం గమనార్హం.

అయితే ఆయన చేసిన వాటిలో డబ్బింగ్ సినిమాలు మినహాయిస్తే … తెలుగులో రాజశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు రెండే వాటిలో ఒకటి పున్నమినాగు కాగా రెండు బామ్మమాట బంగారుబాట.ఈ సినిమా తమిళ్ లో తీశాకే తెలుగులో రీమేక్ చేశారు.తమిళ్ లో పాండ్యరాజా చేసిన పాత్ర తెలుగులో రాజేంద్రప్రసాద్ చేస్తే బామ్మ పాత్ర తమిళ్ లో మనోరమ తెలుగులో భానుమతి చేశారు.రిలీజ్ అయ్యాక అది కూడా మంచి విజయాన్నే నమోదు చేసింది.
అంతేకాదు రాజశేఖర్ సినిమాల్లో విలన్ పాత్ర చాలా ప్రత్యేకంగా డిజైన్ చేయబడుతుంది.అలా ఆయన చేతుల మీదుగానే సత్యరాజ్ మంచి విలన్ గా మాత్రమే కాకుండా మంచి నటుడుగా కూడా కమల్ హసన్ లాంటి వాళ్ల కళ్లల్లో పడడంతో మంచి అవకాశాలను అందుకున్నాడు.
విక్రమ్ ప్రమోషన్స్ లో కమల్ హసన్ తన పాత విక్రమ్ డైరెక్టర్ పేరు ప్రస్తావిస్తాడేమో అని ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూడగా ఎక్కడా అసలు ఆ ప్రస్తావనే తీసుకురాకపోవటంతో తమిళ పరిశ్రమ రాజశేఖర్ ను మర్చిపోయిందా అనిపించింది.

ఇక ఆ విషయం పక్కన పెడితే యాక్షన్ సన్నివేశాలను ఆడియన్స్ కు ఒళ్లు గగుర్పొడిచే రేంజ్ లో తీయడం రాజశేఖర్ కు బాగా తెల్సు.ధర్మదొరైలో రజనీకాంత్ తన చేతికి తగిలిన బుల్లెట్ను తనే పీకేసి, గాయం మీద విస్కీ పోసి, దాన్ని సిగెరెట్ లైటర్ తో వెలిగించి, రెండో చేత్తో ఆ మంట ఆపి దాదాపు ఈ సీను లంకేశ్వరుడులో దాసరి రిపీట్ చేశారు కూడా.ఇలాంటి మాస్ సీన్స్ తీసేప్పుడు ఈ డైరెక్టర్ల ఇమాజినేషన్ అద్భుతం అనిపిస్తుంది లాజిక్ పక్కన పెట్టేసి రెచ్చిపోతారు అదే ఆడియన్స్ కు పట్టేసి కాసుల వర్షం కురుస్తుంది.
అలాగే తెలుగులో చిరంజీవి కోదండరామిరెడ్డిల కాంబినేషన్ లో వచ్చిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా తమిళ్ లో అల్లు అరవిందే రీమేక్ చేసినప్పటికీ ఆ సినిమాకు రాజశేఖర్ తో డైరెక్షన్ చేయించారు.అందులో రజనీ తమ్ముడుగా కాసేపు చిరంజీవి కనిపిస్తాడు.
అలా పున్నమినాగు తర్వాత రాజశేఖర్ డైరెక్షన్ లో చిరంజీవి కనిపించిన సినిమా మా పిల్లైనే.అయితే ఏది ఏమైనప్పటికి రాజశేఖర్ ఇప్పుడు మన మధ్య లేకపోవటం విషాదకరం.
కాగా అసలు ఇండస్ట్రీ వాళ్ళు ఆయనని గుర్తుపెట్టుకోకపోవటం మరో విషాదకరం ల మారింది ఇప్పుడు.







