ప్రపంచంలో కరోనా సృష్టించిన ప్రళయం గురించి అందరికీ తెలిసిందే.మొదట చైనాలో ఉద్భవించిన ఈ కరోనా వైరస్ ప్రపంచదేశాలకు పాకి అల్ల కల్లోలం సృష్టించింది.
ధనిక , పేద అని తేడా లేకుండా అందరూ కరోనా బారిన పడ్డారు.ముఖ్యంగా కరోనా రెండవ వేవ్ లో చాలా ప్రాణ నష్టం జరిగింది.
కరోనా బారిన పడిన వారికి ఇప్పటికీ అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.సామాన్య ప్రజలే కాకుండా సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా కరోనా బారిన పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ముఖ్యంగా బాలీవుడ్ , టాలీవుడ్ ఇండస్ట్రీలలో కరోనా రెండు, మూడు వేవ్ చాలామంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.వారిలో కొంతమంది ప్రాణాలను కూడా కోల్పోయారు.
ఇప్పటికీ కరోనా పూర్తి అంతరించి పోలేదు ప్రజలు బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి ఇప్పటికి కూడా అక్కడక్కడ కరోనా కేసులు బయటపడుతున్నాయి.తాజాగా బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా కరోనా కోరల్లో చిక్కుకున్నాడు.
తనకి కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని కార్తీక్ ఆర్యన్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియచేశాడు.
తమ అభిమాన హీరోకి కరోనా సోకటంతో కార్తీక్ ఆర్యన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తాజాగా కార్తీక్ ఆర్యన్ నటించిన ‘భూల్ భులైయా-2’ థియేటర్లో విడుదలైంది.ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను రాబడుతుంది.ఇప్పటివరకు ఈ సినిమా రూ.144 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది.అంతేకాకుండా కార్తీక్ ఆర్యన్ ఐఫా 2022 వేడుకలకు హాజరు కావాల్సి ఉంది .తమ అభిమాన హీరో సినిమా హిట్టు అయిన సంతోషం పూర్తిగా ఆస్వాదించక ముందే ఇలాంటి బాధ కరమైన వార్త తెలియటంతో అభిమానులతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఆందోళన చెందుతున్నారు.