2017 లో మిస్ యూనివర్స్ టైటిల్ ను సొంతం చేసుకున్న మానుషి ఛిల్లార్ గురించి మనందరికీ తెలిసిందే.మిస్ యూనివర్స్ టైటిల్ ను సొంతం చేసుకొని ప్రపంచం మొత్తం చూపుని తనవైపు తిప్పుకుంది.
హర్యానాకు చెందిన ఈ ముద్దుగుమ్మ మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకోవడంతో పాటు అనేక అవార్డులను కూడా సొంతం చేసుకుంది.ఇది ఇలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో అయినా అక్షయ్ కుమార్ తాజాగా నటించిన పృథ్వీరజ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
చంద్రప్రకాశ్ ద్వివేది ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.
సినిమా నేడు అనగా జూన్ 3వ తేదీ థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే.సినిమా విడుదల సందర్భంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న మిస్ యూనివర్స్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఇంటర్వ్యూలో మానుషి ఛిల్లర్ మాట్లాడుతూ.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి హాట్ కామెంట్స్ చేసింది.
రామ్ చరణ్ తాజాగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయిన తరువాత రామ్ చరణ్ ఇండియాలోనే హాటెస్ట్ యాక్టర్గా మారాడని తెలిపింది.
తన తదుపరి సినిమా ఎవరితో చేయాలని ఉందని అడగ్గా.తనకు రామ్చరణ్తో నటించాలని ఉందని తెలిపింది ఈ ముద్దుగుమ్మ.అలాగే రామ్చరణ్కు పెళ్లి కాకపోయి ఉంటే.అతడితో డేట్కు వెళ్లేదాన్ని అంటూ తన మనసులోని కోరికను బయటపెట్టింది.ఇండస్ట్రీలో తాను ఎక్కువ ఇష్టపడే వ్యక్తి అతనేనని తెలిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.ప్రస్తుతం మానుషి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే డేటింగ్లో ఏం చేస్తారని ప్రశ్నించగా.ఇద్దరం కలిసి సినిమాలు చూసి.
ఫేవరెట్ ఫుడ్ తింటూ.ఎన్నో విషయాలు పంచుకుంటామని చెప్పుకొచ్చింది మానుషి ఛిల్లార్.
అంతే కాకుండా రామ్ చరణ్ కు పెళ్లి అయిపోందని బాధపడింది.