ఏపీ టూరిజం, క్రీడల శాఖ మంత్రి రోజా నేడు తన నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ క్రమంలోనే స్వామివారి దర్శనం అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే రోజా మాట్లాడుతూ అధికారం కోసం చంద్రబాబు నాయుడు ఏమైనా చేస్తారని రోజా వెల్లడించారు.ఎన్టీఆర్ పేరు వినడం కూడా చంద్రబాబుకు నచ్చదని ఆయన జీవితంలో అన్నీ కూడా 420 పనులు చేశారని రోజా చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకపోతే ఎన్టీఆర్ వారసుడిగా రాజకీయాల్లోనూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న బాలకృష్ణ పై కూడా ఈమె షాకింగ్ కామెంట్ చేశారు.నేడు ఎన్టీఆర్ శతజయంతి కావడంతో బాలకృష్ణ ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులోని ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ విషయంపై రోజా మాట్లాడుతూ బాలకృష్ణకు ఇన్ని రోజులు గుర్తు రాని నిమ్మకూరు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు.
బాలకృష్ణను చూస్తే చాలా జాలేస్తుందని, ఆయన చంద్రబాబు సిద్ధం చేసిన స్క్రిప్టు చదువుతూ ఉంటారు.
ముందు ఆ స్క్రిప్ట్ చదవడం మానేసి ఎన్టీఆర్ వారసుడిగా బయటికి రావాలని వాస్తవం గమనించాలని రోజా వెల్లడించారు.ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ అంటే కూడా చంద్రబాబుకు భయమేనని అందుకే తనని పార్టీకి దూరంగా పెట్టారని రోజా తెలిపారు.ఇక ఎన్టీఆర్ పేరు చెప్పి పెద్ద ఎత్తున మహానాడు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు.మహానాడు కార్యక్రమం జగన్ ను తిట్టడానికి మాత్రమే ఏర్పాటు చేస్తారని అంతకుమించి మరేమీ లేదని రోజా తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో ఒక జిల్లాకు ఆయన పేరు పెడితే కనీసం బాబు కృతజ్ఞత చూపలేదని ఈమె ఎద్దేవా చేశారు.