టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా తాజాగా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం మహేష్ బాబు ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.ఇకపోతే ఈ సినిమాకు దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో నటించిన విషయం తెలిసిందే.
ఇందులో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.మైత్రి మూవీ మేకర్స్,14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది పోతోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఒక పీకాక్ మ్యాగజైన్ నిర్వహించిన రాపిడ్ ఫైర్ ఛాలెంజ్ లో మహేష్ బాబుకు పలు ఆసక్తికర ప్రశ్నలు ఎదురుగా ఎంతో ఓపికగా సమాధానం ఇచ్చారు.ఆమె తరచుగా ఎక్కువగా బ్యూటిఫుల్ అన్న పదాన్ని వాడుతారు అని తెలిపారు.
అంతేకాకుండా హాలీవుడ్ మూవీ లయన్ కింగ్ సినిమా ను చూసి తాను ఏడ్చినట్లు తెలిపారు మహేష్ బాబు.ఒకవేళ తాను కనుక డైరెక్టర్ అయితే ఒక్కడు సినిమా నుండి రీక్రియేట్ చేస్తానని తెలిపారు.
అలాగే తనకు అల్లూరి సీతారామరాజు సినిమా ఆల్ టైం ఫేవరేట్ సినిమా అని చెప్పుకొచ్చారు.
ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన తరువాత పాజిటివ్ గా కంటే నెగిటివ్ గానే ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరీ ముఖ్యంగా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఇప్పటికీ అభిమానులకు అనేక సందేహాలు ఉన్నాయి.అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు అన్నీ ఫేక్ అని సర్కారు వారి పాట సినిమా ఊహించని విధంగా సక్సెస్ సాధించలేకపోయింది అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే ఈ సినిమాలో పాటల విషయానికి వస్తే ఈ సినిమాలోని పాటలు పెట్టండి యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతూ రికార్డులు సృష్టిస్తున్నాయి.మరీ ముఖ్యంగా కళావతి పాట అయితే మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది.







