ఖమ్మం జిల్లా రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మశ్రీ వనజీవి రామయ్య తీవ్రంగా గాయపడ్డారు.ఈరోజు తెల్లవారుజామున 5:40 కి ఖమ్మం రూరల్ మండలం మరెమ్మ గుడి వద్ద తన ఇంటిని నుండి ద్వి చక్ర వాహనం పై వెళ్తూ రోడ్డు దాటుతుండగా మరో ద్వి చక్రవాహనం డీ కొట్టడంతో రామయ్య గాయాలపాలైనట్టు తెలుస్తుంది.స్థానికులు గమనించి ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.ఐసీయూలో చికిత్స కొనసాగుతుంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….







