ఖమ్మం : భారతీయ జనతా పార్టీ దళిత మోర్చ – ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇటీవల జరిగిన బిల్లిపురం నాగరాజు హత్యకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు .ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ దగ్గర నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు .
అనంతరం వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అండదండలతో ఎంఐఎం పార్టీ హిందూ యువకుల పై అక్రమ దాడులు చేస్తున్నారని ఆరోపించారు .భారతదేశంలో కులమతాలకు అతీతంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు .ఒక ముస్లిం అమ్మాయిని దళిత హిందూ అబ్బాయి వివాహం చేసుకోవడం వల్ల మతోన్మాదులు నడిరోడ్డుపై దళిత వ్యక్తిని నరకటం , చంపడం అన్యాయమని .ఈ సంఘటన టిఆర్ఎస్ ప్రభుత్వానికి కనిపించట్లేదా ? ఇలా ఎంతోమంది నిర్భాగ్యులు టీఆర్ఎస్ , ఎంఐఎం రౌడీలు మరియు గుండాల చేతిలో బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .కనీసం ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం హోం శాఖ ఇంతవరకు స్పందించలేదు ఎందుకని ప్రశ్నించారు .టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై , దళితులపై , సామాన్య ప్రజలపై దాడులు మరియు ఆత్మహత్యలు జరుగుతున్నాయి అని అన్నారు .ప్రజలకు అన్యాయం చేసే ఏ ప్రభుత్వాన్ని సహించబోమని ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్సి మోర్చా తరఫున హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ఎస్సి మోర్చా అధ్యక్షులు కోటమర్తి సుదర్శన్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింత మల్ల వీరస్వామి , బండ్ల రీగన్ ప్రతాప్ , అనంత ఉపేందర్ , పృథ్వి , అనిత , సరస్వతి , విజయ రెడ్డి , కొప్పుల నరసింహ , ప్రవీణ్ , దుర్గాప్రసాద్ , మృత్యుంజయ్ , జ్వాలా నరసింహారావు , రవి , రాజేష్ తదితరులు పాల్గొన్నారు .