యాదాద్రి జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలను మనఉరు-మనబడి పథకంలో అభివృద్ధి చేయాలని ఎంవి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్ వెంకట్ రెడ్డి కోరారు.శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన విద్యా ఉద్యమం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్టడారు.కోవిడ్-19 కాలంలో చాలామంది విద్యార్థులు బడికి దూరం అయ్యారని,చదువులు మరిచిపోయి వివిధ పనులలో నిమగ్నమైన విద్యార్థులను తిరిగి బడులకు తీసుకురావాలని,బడికి వచ్చిన విద్యార్థులు తరగతులు మారిన చదువు మాత్రం నేర్పలేదని,ఆ పిల్లలందరికీ రీమిడిఎల్ తరగతులు నిర్వహించి తరగతికి తగ్గ చదువు నేర్పాలని,అందుకు ప్రభుత్వం ఈ వేసవిలో ప్రణాళికలు రూపొందించాలని ఆయన అన్నారు.రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలలో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థి 8వ తరగతి వచ్చినా, విద్యను పొందడంలో ఎటువంటి లాభం జరగలేదని ప్రభుత్వం చేపట్టిన’మనఊరు-మనబడి’కార్యక్రమం అన్ని బడులలో ప్రారంభించాలని ఆయన కోరారు.
ప్రతి గ్రామ పంచాయతీకి 25% బడ్జెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జాతీయ,రాష్ట్ర నాయకులు ధనసిరి ప్రకాష్,వివి రావు,ఎర్ర శివరాజు, కొడారి వెంకటేష్,సురుపంగ శివలింగం,బొక్క రాంబాయి,ఆవుల వినోద్ కుమార్,ఒగ్గు క్రిస్టఫర్, హీరాలాల్,బాలరాజ్ గౌడ్,చంద్రశేఖర్ రెడ్డి,సోమ నరసయ్య,పురుషోత్తంరెడ్డి,నలమాసు కుమార్ తదితరులు పాల్గొన్నారు.







