సిక్కు మతానికి చెందిన తొమ్మిదవ గురువు ‘గురు తేజ్ బహదూర్.మొఘలుల కాలంలో గురు తేజ్ బహదూర్ కూడా ఔరంగజేబు క్రూరత్వాన్ని ఎదుర్కొన్నాడని చెబుతారు.
ఔరంగజేబు ప్రజలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చడంలో మునిగితేలేవాడు.అయితే గురు తేజ్ బహదూర్ దానిని తీవ్రంగా వ్యతిరేకించాడు.
తన మద్దతుదారులతో కలసి ఔరంగజేబుపై వ్యతిరేకతను వ్యక్తం చేశాడు, సిక్కు గ్రంథాల ప్రకారం గురు తేజ్ బహదూర్ అనుచరులను ఔరంగజేబు సజీవ దహనం చేశాడు.ఆ తర్వాత కూడా తేజ్ బహదూర్ ఇస్లాంను అంగీకరించలేదు.
దీని తర్వాత 1975లో ఢిల్లీలోని చాందినీ చౌక్లో ఔరంగజేబు అతని తల నరికి చంపాడు. గురు తేజ్ బహదూర్ తెలిపిన కొన్ని అమూల్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1.గురు తేజ్ బహదూర్ ఒక సందర్భంలో మాట్లాడుతూ, మంచి వ్యక్తులుగా మెలగండి.ఇతరుల మనోభావాలను అర్థం చేసుకోండి.ఎవరినీ నొప్పించవద్దు. 2.గురు తేజ్ బహదూర్ జీ ప్రకారం అహంకారాన్ని అధిగమించిన వ్యక్తి జీవితంలో విజయం అనే మెట్లు ఎక్కడం ప్రారంభిస్తాడు.అలాంటి వ్యక్తి జీవితంలో ముక్తిని సాధించగలుగుతాడు. 3.గురు తేజ్ బహదూర్ తెలిపిన వివరాల ప్రకారం విజయం, వైఫల్యం జీవితంలోని వివిధ దశలు.వాటి కారణంగా మీరు నిరాశపడవద్దు.
విజయం ఎప్పుడూ అంతం కాదు.వైఫల్యం ఎప్పుడూ ప్రాణాంతకం కాదు.ఇటవంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండడం చాలా ముఖ్యం. 4.మనిషి సమర్థవంతమైన ఆలోచనలు కలిగివుండాలి.గెలుపు ఓటములనేవి మనిషిపైనే ఆధారపడి ఉంటాయి.
మీరు అంగీకరిస్తే ఓటమి వస్తుంది.మీరు దృఢ సంకల్పంతో ఉంటే విజయం లభిస్తుంది. 5.గురు తేజ్ బహదూర్ భయం అంటే ఏమిటో చెప్పారు.భయం మరెక్కడో ఉండదు.అది మీ మనస్సులో మాత్రమే ఉంటుంది.అందుకే భయపడటం మానేయండి.