ఎన్నికల్లో టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా?

టీఆర్ఎస్ ని అధికారం నుంచి తొలగించేందుకు బీజేపీ, కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.రాబోయో ఎన్నికలకు తెలంగాణ రాజకీయ పార్టీలు నువ్వా నేన్నా అన్నట్టు పోట్టి పడుతున్నారు.

 Will Trs Give A Hattrick In The Election , Trs, Bjp, Congress, Cm Kcr, Rahul Ga-TeluguStop.com

అయితే టీఆర్ఎస్ నే టార్గట్ పెట్టుకుని బీజేపీ , కాంగ్రెస్ పోత్తుకు వస్తారా.లేదా విడివిడిగా ఒటరి పోరాటం చేస్తారా.

అనే విషయం ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో గుబులుపుట్టిస్తుంది.వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ హ్యట్రిక్ కొడుతుందా.

బీజేపీ ఎన్ని సీట్లు వస్తాయి .బండి సంజయ్ పాద యాత్రవల్ల ప్రతిఫలం దక్కుతుందా.అనే దానిపై ఇప్పడు తెలంగాణ ప్రజల్లో చర్చ జరుగుతుంది.

తెలంగాణలో ఇప్పుడు రాజకీయమంతా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగుతోంది.

అనేక అంశాల్లో ఈ రెండు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.టీఆర్ఎస్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే.

కేంద్రాన్ని ఇరుకునపెట్టడం ద్వారా రాష్ట్రంలో బీజేపీని టార్గెట్ చేయాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.ఈ క్రమంలోనే తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ యాసంగి ధాన్యం కొనుగోలు అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.

తెలంగాణలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.అయితే అలా చేయడం వీలు కాదని కేంద్రం కుండబద్ధలు కొట్టింది.

దీంతో కేంద్రంలోని అధికార బీజేపీపై పోరాటం చేయాలని టీఆర్ఎస్ పిలుపునిచ్చింది.ఈ పోరాటంలో రాష్ట్రంలోని రైతులను భాగస్వాములను చేయాలని భావిస్తోంది.

వరి పోరాటాన్ని తీవ్రం చేయాలని భావించిన టీఆర్ఎస్ అధినాయకత్వం.ఈ పోరాటాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ ముందుండి నడిపించారు.ఢిల్లీలో పోరాటం కేసీఆర్ జాతీయ రాజకీయాల లబ్ధి కోసమే చేసినట్లు ప్రతిపక్షాల పార్టీలు భావిస్తున్నారు.ఓ వైపు బీజేపీని టార్గెట్ చేసే విషయంలో టీఆర్ఎస్ తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతుంటే.

ఈ అంశంపై కాంగ్రెస్… టీఆర్ఎస్, బీజేపీలను టార్గెట్ చేస్తోంది.తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Telugu Cm Kcr, Congress, Rahul Gandhi, Trs Mlc Kavitha-Political

ధాన్యం కొనుగోలు అంశంపై తెలుగులో ఓ ట్వీట్‌ చేసిన రాహుల్ గాంధీ తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకూ, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుందని అన్నారు.తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటని విమర్శించారు.రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలని డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలకు టీఆర్ఎస్ కూడా కౌంటర్ ఇస్తోంది.

రాజకీయ లబ్ధి కోసం సంఘీభావం తెలపడం మాత్రమే కాదని.పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలతో కలిసి నిరసనలకు కలిసి రావాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఆ పార్టీ ముఖ్యనేత కవిత పిలుపు ఇచ్చారు.

అయితే ఉన్నట్టుండి రాహుల్ గాంధీ ఈ అంశంపై ట్వీట్ చేయడం వెనుక అసలు కారణం ఏంటనే దానిపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతునే ఉంది.

బీజేపీని టార్గెట్ చేసేందుకు టీఆర్ఎస్ మళ్లీ అధికారం కోసం మొదలుపెట్టిన పోరాటంలో కాంగ్రెస్ కూడా పాలుపంచుకునేందుకు సిద్ధమవుతోందని.

అందుకే రాహుల్ గాంధీ ద్వారా ఈ అంశంపై రాష్ట్ర నేతలు ట్వీట్ చేయించారని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సైతం ఈ అంశంపై పోరాటం చేసేందుకు రంగంలోకి దిగితే.

అప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ పార్టీల మధ్య భిన్నమైన పోరాటాలకు కేంద్రంగా మారుతుందనే చర్చ కూడా సాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube