కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ తో ఏ రేంజ్ హిట్ అందుకున్నాడో అందరికి తెలుసు.కెజిఎఫ్ చాప్టర్ 1 భారీ హిట్ అందుకోవడంతో చాప్టర్ 2 స్టార్ట్ చేసి షూటింగ్ కూడా పూర్తి చేసి విడుదల కూడా చేసారు.
రెండేళ్ల నుండి ఈ సినిమా కోసం సౌత్ ఇండియా మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూసారు.ఇంకా ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా పెరిగాయి.
ఈ నెల 14న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.
రిలీజ్ అయిన అన్ని చోట్ల ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగి పోయింది.
దీంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.ఈ సినిమాలో యష్ యాక్టింగ్ తో మరోసారి దుమ్ము లేపేసాడు.అలాగే ప్రశాంత్ నీల్ తన డైరెక్షన్ తో అదర గొట్టాడనే చెప్పాలి.దీంతో ఏ ఇండస్ట్రీలో చుసిన ఈ సినిమా గురించే టాక్ వినిపిస్తుంది.
ఒక్క సినిమాతో యష్ కన్నడ నాట సంచలనం సృష్టించాడు.రాఖీ బాయ్ గా ఈయన సృష్టించిన వీరంగం గురించి అందరికి తెలుసు.

ఇక ఇప్పుడు చాప్టర్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి రికార్డులను కొల్లగొట్టాడు.ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడంతో సెలెబ్రిటీలు సైతం విషెష్ చెబుతున్నారు.టీమ్ తాము పడిన కష్టానికి ఇంతటి రెస్పాన్స్ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కామెంట్స్ చేసాడు.ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.ఈయన పోస్ట్ చేస్తూ.”వైల్డ్ వైల్డ్ మెన్ మీరు మళ్ళీ అద్భుతం చేసారు.యష్, ప్రశాంత్ నీల్ బాగా చేశారు.
కేజిఎఫ్ టీమ్ అందరికి అభినందనలు” అంటూ ఈయన చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.ఇక రానా సినిమాల విషయానికి వస్తే ఈయన నటించిన విరాటపర్వం సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.
అందులో సాయి పల్లవి రానా కు జోడీగా నటించింది.







