తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.దిల్ రాజు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.
ఇప్పటికే టాలీవుడ్ లో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు.నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.
ఇదిలా ఉంటే దిల్ రాజు ఇటీవల పూజా హెగ్డే గురించి మాట్లాడుతూ పూజా.కాజా అంటూ పూజా హెగ్డే ని ఆకాశానికి ఎత్తేశాడు.
అంతేకాకుండా పూజా హెగ్డే అడుగు పెడితే చాలని సినిమా హిట్ అవుతుంది అంటూ పూజా హెగ్డే పై పొగడ్తల వర్షం కురిపించాడు.
పూజా ని దిల్ రాజు పొగిడిన తీరుని బట్టి చూస్తే పూజా పై దిల్ రాజు కి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం నిర్మాత దిల్ రాజు ఆ సెంటిమెంట్ తోనే అనిల్ రావిపూడి దర్శకత్వం ఎఫ్ 3 సినిమాలో పూజా హెగ్డే కి అవకాశం ఇచ్చారు అని అనిపిస్తోంది.టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్,వరుణ్ తేజ్ లు హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3.
ఇందులో తమన్నా, మెహరీన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో పూజా హెగ్డే ఐటెం సాంగ్ చేస్తోందట.
తాజాగా హైదరాబాద్ లో ఈ పాటకి సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టారు.
పూజా హెగ్డే చేస్తున్న ఈ పాటలో వెంకటేష్, వరుణ్ తేజ్ లతోపాటు తమన్నా, మెహరిన్ లు కూడా కనిపించబోతున్నారు.అయితే నిజానికి ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టాలి అన్న ఆలోచన ముందు ఎవరికి రాలేదు.కానీ సినిమా అంతా పూర్తి అయిన తర్వాత ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ అన్న ఐడియా రావడంతో వెంటనే పూజా హెగ్డే ని రంగంలోకి దింపారు.
ఇక ఈ సినిమాలో తమన్నా,మెహరీన్ లతోపాటు సోనాల్ చౌహాన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.అంటే ఎఫ్ 3 సినిమాలో ముగ్గురు హీరోయిన్ లు అన్నమాట.
ఈ సినీమాలో ముగ్గురు హీరోయిన్ లు వున్నప్పటికి కొత్తగా గ్లామర్ యాడ్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే అదంతా కూడా పూజా పై ఉన్న సెంటిమెంట్ వల్లే.అయితే ఇందులో ఒక్కటే తేడా కొడుతోంది.
అదేమిటంటే ఇటీవలె పూజా నటించిన రాధేశ్యామ్ బోల్తా కొట్టింది.అలాగే తాజాగా విడుదల అయిన బీస్ట్ సినిమా కూడా అలరించలేకపోయింది.
అయినా సరే, పూజా ఉంటే సినిమా హిట్టేనని దిల్ రాజు ఇంకా గట్టిగా నమ్ముతున్నారంటే, ఆ సెంటిమెంట్ కోసం పూజాకి కోటిన్నర వరకూ పారితోషికం ఇవ్వడానికి రెడీ అయ్యారట.మరి బుట్ట బొమ్మ పూజా హెగ్డే దిల్ రాజు సెంటిమెంట్ ను నిలబడుతుందా లేదా చూడాలి మరి.