టాలీవుడ్ యంగ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ రేంజ్ కి ఎదిగాడు.
ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నాడు.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు.
ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ఈ సినిమా ఇటీవలే విడుదల అయిన విషయం అందరికి తెలిసిందే.ఇక ప్రస్తుతం ప్రభాస్ తన తర్వాత సినిమాలో అయినా సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె లాంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
టాలీవుడ్ లో ప్రభాస్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉందో మనందరికి తెలిసిందే.
ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇది ఇలా ఉంటే దర్శకుడు ఓం రావత్ ఇటీవల ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
దేశ సినీ పరిశ్రమలో ప్రతి ఒక్క దర్శకుడు ప్రభాస్ లాంటి హీరోలతో కలిసి పనిచేయాలని అనుకుంటాడు.సినిమా కోసం తన పాత్ర కోసం ప్రభాస్ ప్రాణాలను కూడా లెక్క చేయడు.
అతనిలోని టాలెంట్ను ప్రతి కోణాన్నీ దర్శకుడు కాబట్టి వెండితెరపై మ్యాజిక్ చేయాలని అనుకుంటారు అని చెప్పుకొచ్చారు దర్శకుడు ఓం రావత్.

భారతదేశంలో ఎంతో మంది హీరోలు ఉన్నారు.వారిలో హీరో ప్రభాస్ కూడా ఒకరు.అయితే ప్రభాస్ నటన ఆయన ప్రవర్తన పూర్తిగా విభిన్నమైనది.
దేశంలోనే ప్రభాస్ బిగ్గెస్ట్ స్టార్ అనడానికి ఎటువంటి సందేహం లేదు అని చెప్పుకొచ్చారు దర్శకుడు ఓం రావత్. దర్శకుడు అంటే ప్రభాస్ కు అత్యంత గౌరవం అని, ఇతరుల పట్ల ప్రభాస్ వ్యక్తిగత ప్రవర్తన చాలా అద్భుతంగా ఉంటుంది అని, ప్రభాస్ హృదయం లో ఉండే భావాలు కళ్ళల్లో వ్యక్తమవుతాయి అంటూ ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తారు.

ఇకపోతే ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే.ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.అరవింద ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాకు దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.ప్రభాస్ నటిస్తున్న మరొక సినిమా స్పిరిట్.ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు.ప్రస్తుతం ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు.








