నిద్రపోయే రాష్ట్ర ప్రభుత్వం మద్యం మత్తు వదిలి నీటి సమస్యలపై దృష్టి పెట్టాలి.రాష్ట్ర ప్రభుత్వం స్కీం ల పేరుతో దుబారా ఖర్చులుమాని ఆ డబ్బులు ప్రాజెక్ట్ లపై పెట్టాలి.
తోటపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఒక నెల మద్యంపై వచ్చే డబ్బులు కర్చుపెడితే సరిపోతుంది.తోటపల్లి ప్రాజెక్ట్ తో సుమారు 2లక్షల ఎకరాలు నీటి సమస్య తీరుతుంది.
ప్రాజెక్ట్ ల విషయంలో ఏ ఒక్క ఎంపీ పార్లమెంట్ లో గాని, రాజ్యసభలో గాని ప్రస్తావించలేదు.ప్రాజెక్ట్ ల విషయంలో పక్క రాష్ట్రాలతో సమస్య ఉన్నప్పుడు పార్లమెంట్ వేదికగా సమస్య పరిష్కరనికి కృషి చేయాల్సింది.
రాష్ట్రంలో పెండింగ్ లో ఏ ఒక్క ప్రాజెక్ట్ ఉన్నా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లవచ్చు, జలశక్తి మంత్రి షేకావత్ సమస్యల పరిష్కరనికి కృషి చేస్తారు.జలాశక్తి అభియాన్ పేరుతో ఏమైనా పనులు పూర్తి చేయగలిగితే కేంద్ర మంత్రితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాము
.






