రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య దాదాపు 20 రోజులకు పైగా యుద్ధ వాతావరణం నెలకొనడంతో వంటనూనెలకు భారీ డిమాండ్ పెరిగింది.ముఖ్యంగా భారతదేశంలో వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
ఈ పరిణామంతో చాలా చోట్ల వ్యాపారస్తులు ఇదే సరైన టైం అనుకొని.ప్యాకెట్ పై రేట్ల కంటే మరీ ఎక్కువగా అమ్మేసే పరిస్థితికి తీసుకొస్తున్నారు.
ఇటువంటి పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది.ఏ వ్యాపారస్తుడు అయినా వంట నూనె ధరల ప్యాకెట్ పై ఉన్న ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ఏపీ విజిలెన్స్ అధికారులు.పాత స్టాక్ విషయంలో వ్యాపారస్తులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించ కూడదని స్పష్టం చేశారు.
వంటనూనె విక్రయాల విషయంలో అక్రమాలకు పాల్పడితే బైండోవర్ కేసులు పెడతామని కూడా హెచ్చరించారు.బ్లాక్ మార్కెటింగ్ పై దాడులు కొనసాగుతాయని రాష్ట్రంలో ప్రజలు వంటనూనె అక్రమాలపై 9440906254 కి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు అని నంబర్ అందుబాటులోకి తెచ్చారు.
విజిలెన్స్ అధికారి శంఖబ్రత బాగ్చి ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్ కంపెనీలు, దుకాణాలపై దాడులు నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో క్రమాలు బయట పడ్డ చోట 59 కేసులు 889 కేసులను లీగల్ మెట్రాలజీ అధికారులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.







