ప్రభాస్ – పూజ హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియన్ సినిమా రాధే శ్యామ్.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో, గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా కలిసి నిర్మించిన రాధే శ్యామ్ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది.
అభిమానుల ఎన్నో రోజుల నిరీక్షణ తర్వాత ఈ రోజు సినిమా విడుదల అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకుంది.పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించిన ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణలో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
ఈ సినిమా కోసం రికార్డ్ స్థాయిలో టికెట్ల కోసం ప్రీ బుకింగ్ జరిగాయి.
ఇప్పటికే ఈ సినిమా చూసిన కొందరు సినీ ప్రముఖులు సినిమా గురించి వారి అభిప్రాయం తెలియచేశారు.
మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాపై ప్రశంసలు కురిపించగా తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ కూడా ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పుష్ప, భీమ్లా నాయక్ వంటి సినిమాలకు సూపర్ మ్యూజిక్ అందించిన తమన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.ఇటీవల రాధే శ్యామ్ సినిమా గురించి తమన్ మాట్లాడుతూ ” బాహుబలి సినిమా కంటే రాధే శ్యామ్ సినిమా ఏ మాత్రం తీసిపోదు.బాహుబలి సినిమా ఒక పెద్ద సైజ్ యుద్దం అయితే.రాధే శ్యామ్ సినిమా ఒక పెద్ద సైజ్ లవ్ స్టొరీ ” అంటూ తెలిపాడు.రాధే శ్యామ్ సినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.