ముహూర్తం ఫిక్స్... మహేష్, త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కేది ఆరోజే!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు.

ఈ సినిమా దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసుకుని, వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటించబోతున్నట్లు మనకు తెలిసిందే.

ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్నారని సమాచారం.మహేష్ బాబు ఫిబ్రవరి రెండవ వారం నుంచి సర్కారు వారి పాట సినిమా షూటింగ్లో పాల్గొంటారు ఫిబ్రవరి నెలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి వేసవి సెలవులలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నారు.

ఇకపోతే మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమా ఫిబ్రవరి 3వ తేదీ లాంఛనంగా పూజా కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

మూడవ తేదీ పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోకున్న ఈ చిత్రం తిరిగి మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నట్టు చిత్రబృందం వెల్లడించారు.సుమారు పదకొండు సంవత్సరాల తర్వాత తిరిగి ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉందని తెలియడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇలా వరుస సినిమాలకు కమిట్ అవ్వడంతో మహేష్ బాబు ఇకపై తన స్పీడును పెంచి వరుస సినిమా షూటింగులో పాల్గొంటున్నారని తెలుస్తోంది.

Advertisement

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో మహర్షి సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు