పెళ్లి తర్వాత భర్తతో కలిసి కత్రినా కైఫ్ మొదటి పండుగ సెలబ్రేషన్స్.. ఫొటోస్ వైరల్!

బాలీవుడ్ ప్రేమ జంట విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ఇటీవల మూడుముళ్ళ వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.

ఈ జంట వారి పెళ్లి అయిన తర్వాత మొట్టమొదటి సారిగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నారు.

మాజీ బాలీవుడ్ బ్యాచిలర్ విక్కీ కౌశల్ కత్రినాకైఫ్ తన భార్య అయిన తర్వాత తొలి క్రిస్మస్ పండుగను జరుపుకున్నారు.ఇక ఇదే విషయాన్ని విక్కీ కౌశల్ తన ఇన్​స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

సాధారణంగా క్రిస్మస్ పండుగ సమయంలో మెర్రీ క్రిస్మస్ అంటూ విషెస్ చేస్తూ ఉంటారు.కానీ విక్కీ కౌశల్ మాత్రం తన భార్య కత్రినాకైఫ్ ని ఆనందంతో హగ్ చేసుకుని, క్రిస్మస్ ట్రీని పక్కన పెట్టుకొని మేరీ క్రిస్మస్ అని తెలిపారు.

హిందీలో మేరీ అంటే నా అని అర్థం.అంటే నా క్రిస్మస్ అని ఈ హీరో తెలిపారు అని మనం అర్థం చేసుకోవచ్చు.

Advertisement

పెళ్లి తర్వాత ఈ జంటకు ఇదే మొదటి క్రిస్మస్ పండుగ కావడంతో ఈ పండుగ సందర్భంగా ఈ జంట దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు చూసిన అభిమానులు వారికి క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు వారిద్దరిపై పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే ఈ జంట ఇటీవల డిసెంబర్ 9న వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.వీరి పెళ్లి రాజస్థాన్ లోని ఒక హోటల్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

కాకపోతే వీరి పెళ్లికి ఇరువురి బంధుమిత్రులతో పాటు, సన్నిహితులు, అలాగే బాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.ఇక వీరు పెళ్లి పనులు ముగించుకున్న తరువాత పెళ్లికి ముందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పలు ప్రాజెక్టులు పూర్తి చేయనున్నారు.ఈ క్రమంలోనే కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న టైగర్ 3 సినిమాలో చివరి షెడ్యూల్ పూర్తి చేసేందుకు వెళ్లనుంది.

మొత్తంగా ఈ జంట పెళ్లి పనులు పూర్తి అయిన తర్వాత ఇరువురు ఎవరి పనుల్లో వారు బిజీగా మారనున్నారు.విక్కీ కౌశల్ కూడా సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీ అవుతున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు