నేను తల్లిని అయ్యాను.. అందుకే ఈ సంవత్సరం నాకో అద్భుతం: ప్రీతీ జింతా

2021 ముగుస్తోంది.రోజులు తొందరగా గడుస్తున్నాయి.2022 రాబోతుంది.

అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇంకా కొద్ది రోజులు సమయం ఉండగానే అప్పుడే అక్కడక్కడా సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.

కొందరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఘనంగా ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు.సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పడానికి రెడీ అవుతున్నారు.

ప్రపంచానికి 2020,2021 సంవత్సరాలు ఒక పీడకలలా గుర్తుండిపోతాయి.ఎందుకంటే కరోనా మహమ్మారి సృష్టించిన గందరగోళం అంతా ఇంతా కాదు.

ఇటు సామాన్యులను అటు సెలబ్రిటీలను ప్రతి ఒక్కరిని ఈ కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది.ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.

Advertisement

సినిమా వారు సైతం ఈ కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొక తప్పలేదు.ఇదిలా ఉంటే 2021 వెరీ వెరీ స్పెషల్ గా మారిపోయింది అంటోంది బ్యూటీ ప్రీతిజింతా.

ప్రస్తుతం ఆమె అమెరికాలో సెటిల్ అయ్యి ఎంతో హ్యాపీగా ఉంది.తన వ్యక్తిగత జీవితంలోని పరిణామాలతో ఆమెకు 2021 స్పెషల్ గా మారిపోయింది.

ఎందుకంటే తన అమెరికన్ భర్త జీనీ గుడ్ఎనఫ్ తో కలసి యుఏలో సెటిల్ అయింది.

ప్రీతిజింతా గత నెలలో పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది.అదేమిటంటే తాను తల్లి అయినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.గుడ్ఎనఫ్ సరోగసీ ద్వారా కవలపిల్లలకు జన్మనిచ్చారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఒక కొడుకు ఒక కూతురు జన్మించడంతో తనకు నిజంగానే 2021 స్పెషల్ అంటోంది ప్రీతిజింతా. ఈ సంవత్సరం మన జీవితంలోకి ఇద్దరూ అందమైన బేబీ లు రావటమే అందుకు కారణమని కూడా తెలిపింది.

Advertisement

ఈ సందర్భంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో 2021 మొదట దిగిన ఫోటోని షేర్ చేసింది.ఆ ఫోటోలు షేర్ చేస్తూ 2021 లో నేను తల్లిని అయ్యాను అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేసింది.

తాజా వార్తలు