లేటెస్ట్ బజ్.. సర్కారు వారి పాట షూటింగ్ ఎంత వరకు వచ్చిందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తూన్న విషయం విదితమే.

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా కోసం అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అంతా.

ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి లో సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది అని సంతోషపడ్డారు.అయితే ఈ సినిమాను కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించడంతో అందరిలో నిరాశ మొదలు అయ్యింది.

ఇక ఈ మధ్యనే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.వచ్చే ఏడాది ఏప్రిల్ 1న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ సినిమా ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విషయం కూడా తెలిసిందే.ఇంకా కొద్దిగా బ్యాలన్స్ షూట్ ఉందని తెలుసు కానీ ఎంత ఉందో ఇప్పటి వరకు తెలియలేదు.

Advertisement

అయితే తాజా గా ఈ సినిమా షూట్ పై ఒక బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సర్కారు వారి పాట సినిమాకి ఇంకా చాలా రోజుల షూట్ బ్యాలెన్స్ ఉందని సమాచారం అందుతుంది.తాజాగా ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఇంకా నెల రోజుల పైగానే షూట్ బ్యాలన్స్ ఉందట.

అయితే ఈ బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేయడానికి కొద్దిగా బ్రేక్ వచ్చింది.ఎందుకంటే ఇటీవలే మహేష్ బాబు సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే.ప్రెజెంట్ మహేష్ బాబు రెస్ట్ తీసుకుంటున్నారు.

అందుకే ఈ సినిమాకు ఒక నెల రోజుల గ్యాప్ ఇచ్చి ఈ సినిమా షూటింగ్ ను ఫిబ్రవరిలో స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.అందుకు ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇక ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు, మైత్రి మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు