జబర్దస్త్‌ లో ఏం జరుగుతోంది.. అనసూయ ప్లేస్ లో మళ్లీ రష్మి

తెలుగు బుల్లి తెరపై దాదాపు 9 ఏళ్లు గా ఏక చత్రాధిపత్యం అన్నట్లుగా రేటింగ్ ల పరంపర కొనసాగిస్తున్న కామెడీ షో జబర్దస్త్‌.

ఇప్పటి వరకు జబర్దస్త్‌ తో ఎంతో మంది కమెడియన్‌ లు పరిచయం అయ్యారు.

రోడ్డు మీద తిరుగుతూ కనీసం తినడానికి తిండి లేని వారు ఎంతో మంది కూడా జబర్దస్త్‌ వల్ల ఇప్పుడు కార్లు.బంగ్లాలు కొనుగోలు చేయడం జరిగింది.

జబర్దస్త్‌ అనేది అనసూయ యాంకర్ గా నాగబాబు మరియు రోజా జడ్జ్‌ లుగా మొదలు అయ్యింది.కొన్ని వారాలకు అనసూయ తప్పుకుంది.

దాంతో ఆ స్థానంలో రష్మి వచ్చింది.జబర్దస్త్‌ కు వచ్చిన బీభత్సమైన ఫాలోయింగ్‌ తో ఎక్స్‌ట్రా జబర్దస్త్ ను కూడా తీసుకు వచ్చారు.

Advertisement

రెండిటికి కూడా రష్మి చాలా కాలం పాటు యాంకర్ గా చేసింది.ఆ సమయంలోనే అనసూయ రీ ఎంట్రీ ఇచ్చింది.

దాంతో ఇద్దరు కూడా జబర్దస్త్‌ కు యాంకర్ లుగా వ్యవహరిస్తు వస్తున్నారు.

ఒకరు గురువారం వస్తే ఒకరు ఆదివారం వస్తున్నారు.ఇప్పుడు మళ్లీ రెండు జబర్దస్త్‌ లకు కూడా రష్మి యాంకర్ గా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.వచ్చే వారంలో రాబోతున్న ఎపిసోడ్ లకు సంబంధించిన ప్రోమోలు వచ్చాయి.

ఆ ప్రోమోల్లో అనసూయ కనిపించకుండా పోయింది.కేవలం రష్మి మాత్రమే ఉంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

దాంతో ఆమె సినిమాలతో బిజీ అయ్యింది కనుక ఈ జబర్దస్త్‌ ను వదిలేసిందేమో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.కాని కొందరు మాత్రం చిన్న బ్రేక్ మాత్రమే ఆమె మళ్లీ వస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇక కొందరు ఇప్పటికే స్టార్‌ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ లో జాయిన్ అయ్యారు.అందులో ముఖ్యంగా అదిరే అభి కామెడీ స్టార్స్ కు వెళ్లారు.

అక్కడ కొత్త జర్నీ మొదలు పెట్టారు.కాని అంతకు ముందు షూట్‌ చేశారో ఏమో కాని అభి వచ్చే వారం కూడా స్కిట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మొత్తానికి జబర్దస్త్​ లో ఏం జరుగుతుంది అనేది చర్చనీయాంశంగా ఉంది.

తాజా వార్తలు