టీడీపీలో చంద్రబాబు మాటను ఇప్పుడు ఎవరూ పెద్దగా లెక్క చేయట్లేదు.పైగా ఆయన మీదే విమర్శలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది.
గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచే చంద్రబాబు మీద సొంత పార్టీ నేతలే అసంతృప్తిలో ఉన్నారు.ఇంకొందరు అయితే బహిరంగంగానే చంద్రబాబును విమర్శించడం మనం చూస్తున్నాం.
అయితే మొదటి నుంచి పార్టీకి ఆయా జిల్లాల్లో కీలకంగా ఉన్న కొన్ని కుటుంబాలు ఇప్పుడు చంద్రబాబుకు కొన్ని షరతులు కూడా పెట్టేస్తున్నాయి.ఇదే చంద్రబాబుకు పెద్ద ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.
రాయల సీమ జిల్లాల్లో మొదటి నుంచి టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న కుటుంబాల్లో జేసీ బ్రదర్స్ కుటుంబం, పరిటాల కుటుంబం చాలా కీలకం.సామాజిక పరంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఈ కుటుంబాలు మొదటి నుంచి రాయలసీమ మీద పట్టు సాధించాయి.
కాబట్టి ఈ కుటుంబాల్లో ఒక టికెట్ కాకుండా ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇస్తూ వస్తున్నారు.ఇక జేసీ వర్గానికి అయితే ఒకటి తాడిపత్రి నియోజకవర్గం టికెట్ ఇస్తే.
మరొకటి అనంతపురం ఎంపీ టికెట్ ఇవ్వాలి.ఇక పరిటాల కుటుంబంలో కూడా ధర్మవరం తో పాటు రాప్తాడు టికెట్లు ఇవ్ఆలి.
అయితే గత ఎన్నికల్లో రాప్తాడులో శ్రీరామ్ ఓడిపోయారు.కాబట్టి ఈ సారి రాప్తాడు టికెట్ తల్లి సునీతకు ఇప్పించి తాను ధర్మవరం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు శ్రీరామ్.ఇక సునీత మీద ఉన్న సానుభూతితో పాటు గెలుస్తుందనే నమ్మకం కూడా చంద్రబాబుకు ఉన్నది.కాబట్టి ఇలా జేసీ ఫ్యామిలీ, ఇటు పరిటాల ఫ్యామిలీ రెండు టికెట్లను ఇవ్వాల్సిందే అంటూ చంద్రబాబుకు షరతులు పెడుతున్నాయి.
అలా అయితేనే పార్టీలో కీలకంగా ఉంటామని చెబుతున్నాయి ఈ కుటుంబాలు.మరి చంద్రబాబు వీరి షరతులకు ఓకే అంటారా లేదా అన్నది వేచి చూడాలి.