ప్రభాస్ 'ఆదిపురుష్‌' నుండి అతి పెద్ద అప్‌డేట్‌ ఇచ్చారోచ్‌!

బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ ఆడియన్స్‌ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆదిపురుష్‌ సినిమా నుండి కీలక అప్డేట్‌ ను యూనిట్‌ సభ్యులు ఇచ్చారు.

ఈ సినిమాలో లంకేశ్వరుడు పాత్రను పోషిస్తున్న సైఫ్‌ అలీ ఖాన్‌ కు సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ ను ముగించారట.

తాజాగా ప్రభాస్ మరియు ఇతర ముఖ్య నటీనటులతో షూటింగ్‌ ను చేస్తున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాముడి పాత్రకు సంబంధించిన షూటింగ్‌ ను మరో 25 నుండి 30 వర్కంగ్‌ డేస్ లో ముగించేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

రికార్డు స్థాయిలో ఈ సినిమాను ఆదిపురుష్‌ తెరకెక్కిస్తున్నాడు.దాదాపుగా రూ.500 కోట్ల రూపాయలను ఈ సినిమాకు ఖర్చు చేస్తున్నాడట.అందులో 250 నుండి 300 కోట్ల రూపాయలను కేవలం వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ కే కేటాయించబోతున్నారు.

ఆరు నెలల పాటు దేశ విదేశాలకు చెందిన టెక్నీషియన్స్‌ కొన్ని వేల మంది ఈ సినిమాకు సంబంధించిన వర్క్‌ ను చేయబోతున్నారు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

Advertisement

ప్రభాస్ రాధే శ్యామ్‌ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని చెబుతున్నారు.ఇక సమ్మర్‌ లో కేజీఎఫ్‌ డైరెక్టర్ దర్శకత్వం లో ప్రభాస్ నటిస్తున్న సలార్‌ సినిమా ను విడుదల చేయాలని నిర్ణయించారు.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా ముగించేశారు.ఇదే సమయంలో ఆదిపురుష్‌ ను వచ్చే ఏడ ఆది ఆగస్టులో విడుదల చేస్తామని చెబుతున్నారు.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంటుందని అంటున్నారు.

ఇండియాలోని అన్ని భాషలతో పాటు ఇంగ్లీష్‌ ఇంకా పలు విదేశీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.వచ్చే ఏడాది ఆగస్టు నుండి మొదలుకుని డిసెంబర్‌ వరకు వివిధ భాషల్లో విడుదల చేస్తూనే ఉంటామని నిర్మాతలు చెబుతున్నారు.

ఈ సినిమాలో సీత పాత్రను కృతి సనన్ పోషిస్తుంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ షూటింగ్‌ ను చేస్తున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

వచ్చే ఏడాదిలో విడుదల చేస్తామని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు