రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఏపీలో రాజకీయ వేడిని పుట్టించాయి.
తనపై కోపంతో ఇండస్ట్రీని కక్ష సాధిస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.
పవన్ చేసిన వ్యాఖ్యలతో మంత్రులు పలువురు తీవ్ర స్థాయిలో రెచ్చి పోయి ప్రతి విమర్శలు చేశారు.పవన్ చేసిన వ్యాఖ్యలు తమకు సంబంధం లేదు అన్నట్లుగా నిర్మాతల మండలి ఒక లేఖను విడుదల చేసి అందులో జగన్ ప్రభుత్వం అంతా బాగానే ఉంది అంటూ పేర్కొన్నారు.
ఆ సమయంలో పవన్ ను ఒంటరి చేశారు అంటూ అంతా కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.నిర్మాతల మండలి పై సాదారణ జనాలు ఆగ్రహంతో మండి పోయారు.
పైగా మంత్రి పేర్ని నానితో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన నిర్మాతలు మరింతగా పవన్ అభిమానుల కోపంకు కారణం అయ్యారు.కొన్ని గంటలు కూడా గడవక ముందే పేర్ని నానిని కలిసి నిర్మాతలు పవన్ కళ్యాణ్ ను కలవడం జరిగింది.
టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ గార్ని ఈ రోజు ఉదయం ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్, బన్నీ వాసు లు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
చిత్రపరిశ్రమకు సంభందించిన సమస్యల గురించి సృహృద్భావ వాతావరణంలో వీరి మధ్య చర్చలు జరిగాయి.ఒక వైపు ప్రభుత్వం తో సఖ్యంగా ఉంటూనే మరో వైపు పవన్ ను కూడా వదులుకోకుండా పట్టుకోవాలని నిర్మాతల భావన కావచ్చు.అందుకే పవన్ కళ్యాణ్ ను కూడా వెంటనే కలిసి ఆయన అభిమానుల్లో ఉన్న కోపం ను తగ్గించే ప్రయత్నం చేయడం జరిగింది.
ఈ విషయంలో ముందు ముందు మరెలాంటి పర్యావసనాలు జరుగుతాయో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy