లవ్ స్టోరీ సక్సెస్ మీట్..గెస్టులుగా సుకుమార్, నాగ్..!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా ప్రేమ కథా చిత్రాలను తెరకెక్కించే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లవ్ స్టోరీ.

ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసారు.

ఎట్టకేలకు వాళ్ళ కల నెరవేరి ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదల చేసింది చిత్ర యూనిట్.ఈ సినిమాపై ముందు నుండే అంచనాలు బాగా ఉన్నాయి.

ఇక విడుదల తర్వాత కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి నటన అద్భుతం అంటూ చుసిన వారంతా పొగుడుతున్నారు.

ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ఇంత త్వరగా జనాలలోకి రావడానికి నాగ చైతన్య, సాయి పల్లవి నటన అయితే మరొక కారణం మ్యూజిక్ అనే చెప్పుకోవాలి.

Advertisement

పవన్ సి హెచ్ అందించిన సంగీతం వల్ల కూడా ఈ సినిమా త్వరగా జనాల్లోకి రీచ్ అయ్యి సక్సెస్ అయ్యేలా చేసింది.ఇక ఈ సినిమా విజయం సాధించిన గుర్తుగా లవ్ స్టోరీ సినిమా యూనిట్ మొత్తం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేస్తున్నారు.హైదరాబాద్ లోని ట్రైటెండ్ హోటల్ లో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి ఈ కార్యక్రమం స్టార్ట్ అవ్వబోతుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నాగార్జున, సుకుమార్ హాజరవ్వ బోతున్నారు.

ఈ సినిమా యువతకు మాత్రమే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.శేఖర్ కమ్ముల మ్యాజిక్ మరొకసారి ఈ సినిమాలో కనిపించింది.మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్శిస్ లో కూడా మంచి కలెక్షన్లు రాబడుతుంది.

కరోనా తర్వాత విదేశాల్లో కలెక్షన్లు రాబడుతున్న మొదటి చిత్రంగా కూడా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది.ఇంత సక్సెస్ అవ్వడం వల్ల ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు