నువ్వు నన్ను బాధ పెట్టి ఉండొచ్చు.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్!

స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు సొషల్ మీడియా ద్వారా తన మనస్సులోని భావాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

రెండు రోజుల క్రితం తిరుమలలో రూమర్ల గురించి స్పందించాలని సమంతను జర్నలిస్ట్ కోరగా గుడికి వచ్చి బుద్ధుందా అంటూ సమంత చేసిన వ్యాఖ్యలపై జోరుగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

కొంతమంది సమంతను సమర్థిస్తే సమంత చేసిన వ్యాఖ్యలు సరికావని మరికొందరు విమర్శించారు.అయితే తాజాగా సమంత ఇన్ స్టాగ్రామ్ వేదికగా పెట్టిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఆ పోస్ట్ లో సమంత నువ్వు నన్ను బాధపెట్టి ఉండవచ్చని నేను కూడా నిన్ను బాధపెట్టి ఉండవచ్చని ఒకరినొకరం బాధ పెట్టుకుని ఉండవచ్చని మొత్తానికి రియాలిటీ మాత్రం ఇదేనని పేర్కొన్నారు.వసంతం కావాలంటే శిశిరంను కూడా అనుభవించాలని ఆమె చెప్పుకొచ్చారు.

సమంత వేర్వేరు కోట్స్ తో చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.నెటిజన్లలో చాలామంది సమంత నాగచైతన్యను ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

సాధారణంగా హీరోయిన్లు ఇలాంటి పోస్ట్ లు పెట్టినా నెటిజన్లు పెద్దగా పట్టించుకోరు.ఈ మధ్య కాలంలో సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో అక్కినేని పేరును తొలగించడం, సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవడంతో సమంత పెట్టిన పోస్టుల గురించి నెటిజన్ల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది.

సమంత ఇన్ స్టా స్టేటస్ లలో పెట్టిన మెసేజ్ కార్డులను చూసి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.సమంత పబ్లిక్ డొమైన్ లలో పోస్టులు పెడుతుండటంతో సమంత చైతన్య మధ్య ఏం జరుగుతుందో నెటిజన్లకు అర్థం కావడం లేదు.త్వరలోనే సమంత చైతన్యల రిలేషన్ షిప్ గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు