సౌత్ ప్రేక్షకులకు ప్రేమ ఎక్కువ.. నార్త్ హీరోయిన్!

నటి శ్వేతా అవస్తి "మళ్ళీ మళ్ళీ చూసా" అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

తాజాగా శ్వేత అవస్తి జంటగా తెరకెక్కిన చిత్రం ‘మెరిసే మెరిసే’ .

కె.పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వెంకటేష్‌ కొత్తూరి నిర్మించారు.ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను దక్కించుకుంది.

ఈ క్రమంలోనే నటి శ్వేత మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా నటి మాట్లాడుతూ.

మా స్వస్థలం పూణే, కెరియర్ మొదట్లో మోడలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత పలు కమర్షియల్ యాడ్స్ కోసం హైదరాబాద్ వచ్చి వెళ్ళే దానిని తెలిపారు.ఈ క్రమంలోనే "మళ్ళీ మళ్ళీ చూసా" సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది.

Advertisement

అది నా మొదటి చిత్రం."మెరిసే మెరిసే" తెలుగులో తన రెండవ చిత్రమని ఈ సందర్భంగా తెలియజేశారు.

మెరిసే మెరిసే చిత్రం 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రంలో నేను పోషించిన వెన్నెల పాత్రకు మంచి ఆదరణ వస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఉత్తరాది ప్రేక్షకులతో పోలిస్తే దక్షిణాది ప్రేక్షకులు సినిమాలను ఎంతో ఆదరిస్తారు.ఇక్కడ సెలబ్రిటీలను ఎంతో ఆరాధిస్తారు.దక్షిణాదిలో సినిమా అంటే ఒక ఎమోషన్.

ఒక సెలబ్రేషన్ అంటూ దక్షిణాది అభిమానులపై ప్రశంసలు కురిపించారు.అదేవిధంగా మహానటిలో కీర్తి సురేష్ నటన అద్భుతమని అలాంటి పాత్రలో చేయాలనే కల తనకి ఉందని ఈ సందర్భంగా శ్వేత తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు