భర్తను కాటికి పంపిన భార్య, ఆ తర్వాత బావతో బెడ్ రూమ్ లో.....

ప్రస్తుత కాలంలో కొందరు కామాంధకారంలో మునిగిపోయి తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ప్రాణాలను కోల్పోతున్నారు.

కాగా తాజాగా ఓ వివాహిత పెళ్లి అయినా సరే తన బావపై ఉన్నటువంటి మోజు తీరకపోవడంతో వివాహేతర సంబంధం పెట్టుకొని చివరికి ఆ విషయం కాస్త తన భర్తకు తెలియడంతో భర్తని దారుణంగా హతమార్చి న ఘటన చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోనే "బలరాంపూర్" జిల్లా పరిసర ప్రాంతంలో "స్వాతి (పేరు మార్చాం)" అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో నివాసముంటోంది.కాగా స్వాతి భర్త కుటుంబ పోషణ నిమిత్తం స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.

అయితే ఇక్కడివరకు అంతా బాగానే ఉంది.కాగా స్వాతి మేన బావ గత కొద్దికాలంగా స్వాతి ఉంటున్న ప్రాంతంలోనే నివాసముంటున్నాడు.

దీంతో అప్పుడప్పుడు స్వాతి ఇంటికి తన బావ వచ్చి వెళుతూ వుండేవాడు.ఈ క్రమంలో బావతో స్వాతికి వివాహేతర సంబంధం ఏర్పడింది.

Advertisement

దీంతో స్వాతి తన భర్త ఇంట్లో లేనప్పుడు బావని పిలిపించుకుని ఎంజాయ్ చేసేది.

కాగా ఇటీవలే ఈ విషయం స్వాతి భర్తకు తెలియడంతో ఇద్దరిని నిలదీశాడు.అంతేకాకుండా మరోమారు తన ఇంటి ఛాయలకు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్వాతి బావ కి వార్నింగ్ ఇచ్చాడు.అయినప్పటికీ స్వాతి తన భర్త మాటలను పెడచెవిన పెట్టింది.

కాగా ఇటీవలే మరోమారు ఈ విషయంపై గొడవ జరగడంతో స్వాతి తన ప్రియుడిని పిలిపించుకుని భర్తని హతమార్చింది అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది.అయితే పోలీసుల విచారణలో స్వాతి ప్రవర్తన లో పలు మార్పులను గమనించారు.

దాంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన బావతో కలిసి తానే హతమార్చినట్లు పోలీసుల ఎదుట నేరం అంగీకరించింది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు