బన్నీ, కొరటాల మూవీపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

ప్రస్తుతం ఆచార్య సినిమాని పూర్తి చేసే పనిలో దర్శకుడు కొరటాల శివ ఉన్నాడు.ఈ సినిమాని వచ్చేనెలలో రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.

అయితే కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ఆ ప్రభావం సినిమా రిలీజ్ ల మీద పడుతుంది.ఆచార్య రిలీజ్ అయ్యేది లేనిదీ అప్పడే ఏమీ చెప్పలేని పరిస్థితి.

ఇదిలా ఉంటే కొరటాల తన నెక్స్ట్ సినిమాని ఎన్టీఆర్ తో చేయడానికి నిర్ణయించుకున్నాడు.ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.

యువసుధ బ్యానర్ లో మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నాడు.ఇక కళ్యాణ్ రామ్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.

Advertisement

ఇక ఈ సినిమాని జులైలో సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నారని స్పష్టం చేసేశారు.ఇదిలా ఉంటే ఇప్పుడు కొరటాల శివ ఎన్టీఅర్ సినిమా కంటే ముందుగా అల్లు అర్జున్ తో ఒక ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేయడమే కాకుండా కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.

పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమా ఉంటుందని తెలిపారు.యువసుధ బ్యానర్ లో, గీతా ఆర్ట్స్ తో కలిపి ఈ సినిమా నిర్మిస్తుందని తెలిపారు.

ఇక ఆచార్య సినిమా తర్వాత అల్లు అర్జున్ మూవీని స్టార్ట్ చేస్తారనే ప్రచారం నడిచింది.అయితే ఊహించని విధంగా ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాని కొరటాల ముందుకి తీసుకొచ్చాడు.

ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు.ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ తో సినిమా క్యాన్సిల్ అయ్యిందనే ప్రచారం తెరపైకి వచ్చింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అల్లు అర్జున్ తో కొరటాల శివకి స్టొరీ విషయంలో అభిప్రాయ బేధాలు వచ్చాయని, ఈ కారణంగానే మూవీ ఆగిపోయిందనే చర్చ నడుస్తుంది.ఈ నేపధ్యంలో దీనికి ఫుల్ స్టాప్ పెట్టె విధంగా ఇప్పుడు నిర్మాత మిక్కిలినేని సుధాకర్ అల్లు అర్జున్, కొరటాల సినిమాపై క్లారిటీ ఇచ్చారు.

Advertisement

ఈ సినిమా క్యాన్సిల్ కాలేదని, ఏప్రిల్ 2022 తర్వాత అది స్టార్ట్ అవుతుందని చెప్పాడు.మరి దీనిలో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు