బుట్టబొమ్మ రీమేక్‌లో మహేష్ పాప రెచ్చిపోతుందట!

టాలీవుడ్‌లో గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచిన ‘అల వైకుంఠపురములో’ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గె్స్ట్ హిట్ మూవీగా ‘అల వైకుంఠపురములో’ నిలిచిందని ఆ సినిమా సాధించిన రికార్డులే తెలుపుతున్నాయి.కేవలం కమర్షియల్ పరంగా మాత్రమే కాకుండా మ్యూజికల్ పరంగా కూడా ఈ సినిమా ఓ సెన్సేషన్.

థమన్ అందించిన సంగీతం ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.దీంతో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది.

అయితే ప్రస్తుతం ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.ముఖ్యంగా హిందీలో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు అక్కడి దర్శకనిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు.

Advertisement

ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సోదరుడు రోహిత్ ధావన్ ఈ సినిమాను డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.కార్తీక్ ఆర్యన్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో ఎవరిని తీసుకుంటారా అనే ప్రశ్న అందరిలో నెలకొంది.తెలుగులో అల వైకుంఠపురములో చిత్రంలో పుజా హెగ్డే నటించగా, ఆమె కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా ఈ సినిమా నిలిచింది.

దీంతో ఇప్పుడు హిందీ రీమేక్‌లో అందాల భామ కృతి సానన్‌ను తీసుకునేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.టాలీవుడ్‌లో మహేష్ బాబు నటించిన ‘1-నేనొక్కడినే’ చిత్రంలో కృతి సానన్ నటించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ బ్యూటీ అల వైకుంఠపురములో చిత్రం రీమేక్‌లో నటిస్తే ఎలా ఉంటుందా అనే ఆసక్తి ఆమె అభిమానుల్లో నెలకొంది.ఇక ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’లో కూడా కృతి సానన్ నటిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

మరి ఈ బ్యూటీ నిజంగానే అల వైకుంఠపురములో రీమేక్‌లో నటిస్తుందా లేదా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు