కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు...

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి, చారాణ ఉంటే.అదే ప్రజలకు తెలియకుండా చేసే దోపిడీ బారాణా ఉందని ఇప్పటికే జనం అనుకుంటున్నారట.

ఈ నేపధ్యంలో అధికారంలో ఉన్న కారును స్క్రాప్‌లో పడవేసి, బీజేపీ అధికారంలోకి రావాలని శతవిధాలుగా ప్రయత్నిస్తుంది.ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కామన్ అయిపోయింది.

ఇప్పటికే బండి సంజయ్ గులాభి రెమ్మలు రాలిపోయేలా ఆరోపణలు చేస్తూ, తెలంగాణ సీయంకు నిదుర లేకుండా చేస్తున్నాడని అంతా అనుకునేలా ప్రవర్తిస్తున్నాడట.అయితే ప్రస్తుతం తాజాగా కూడా బండి సంజయ్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారట.

మానవత్వం లేని మానవ మృగం కేసీఆర్ అని ఆరోపణలు చేశారట.దుబ్బాకలో బిజేపీ కొట్టిన దెబ్బకు కేసీఆర్ గూబ గుయ్యిమన్నదన్న ఆయన తెలంగాణలో తెరాస గడీల పాలన, రాక్షస పాలన అంతమొందించాలంటే బీజేపీతోనే సాధ్యమని వెల్లడించారు.

Advertisement

ఇలా ఒకరి పై ఒకరు విమర్శించు కోవడం తప్పిదే వీరి పాలనలో పేదలకు మిగిలిన గోచీ కూడా ఊడేలా ఉందని ఇప్పటికే పేదలు అల్లాడుతున్నారట.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు