వరదల వల్ల మీ బండి పాడైందా..? అయితే ఇది మీరు చదవాల్సిందే

ఇటీవల వరదలకు హైదరాబాద్ అతలాకుతలమైంది.చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వచ్చిన భారీ వరదలకు హైదరాబాద్ ప్రజలు బెంబేలెత్తిపోయారు.

ఎక్కడ చూసినా రోడ్లన్నీ చెరువుల్లా కనిపించాయి.లోతట్లు ప్రాంతాల్లో ఇళ్లన్నీ మునిగిపోవడంతో అక్కడ నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

హైదరాబాద్‌లో ఇంత భారీ వర్షపాతం నమోదు కావడం 40 సంవత్సరాల తర్వాత ఇది రెండోసారి అని ఇటీవల భారత వాతావరణశాఖ కూడా ప్రకటించింది.వరదతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ ప్రజలను ఆదుకునేందుకు చాలా స్వచ్ఛంధ సంస్థలతో పాటు సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ముందుకొచ్చారు.

వరద బాధితులకు తమ వంతుగా ఆర్థిక సహాయం ప్రకటించారు.బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు వరద బాధితులకు ఆర్థిక సహాయం ప్రకటించిన వారిలో ఉన్నారు.

Advertisement

అయితే వరదల వల్ల రోడ్లు చెరువుల్లా మారిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు.కొన్ని ప్రాంతాల్లో వాహనాలు చాలారోజుల పాటు నీటిలోనే ఉండిపోవడంతో పాడైపోయాయి.

ఇక కొన్నిచోట్ల వాహనాల లోపలికి నీళ్లు పోయి చెడిపోయాయి.ఈ క్రమంలో హైదరాబాద్‌లో వరదలకు వాహనాలు పాడైపోయిన తమ కస్టమర్లకు టీవీఎస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

వరదల్లో పాడైపోయిన వాహనాలకు ఫ్రీ సర్వీసింగ్ ఉంటుందని ప్రకటించింది.హైదరాబాద్‌లోని అన్ని సర్వీస్ సెంటర్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, మరిన్ని వివరాలకు 9121177261 నంబర్‌కు కాల్ చేయవచ్చని వెల్లడించింది.

అయితే వాహనదారులు కేవలం స్పేర్ పార్ట్‌లు కొనుక్కుంటే చాలని, సర్వీసింగ్‌కు సంబంధించిలేబర్ ఛార్జ్ తీసుకోమంది.

బ్రెజిల్‌లో భారీ వరదలు.. పెంపుడు కుక్కలతో ఐక్యం కావడంతో యజమాని కన్నీళ్లు..
Advertisement

తాజా వార్తలు