మరో విభిన్న కథతో రాబోతున్న ఐశ్వర్య రాజేష్

సౌత్ లో హీరోయిన్ గా కెరియర్ ఆరంభం నుంచి భిన్నమైన కథలతో సినిమాలు చేస్తున్న హీరోయిన్ అంటే వెంటనే వినిపించే పేరు ఐశ్వర్య రాజేష్.

ఆమె నటిగా పరిచయం అయ్యింది డీగ్లామర్ పాత్రతోనే.

తెలుగమ్మాయి అయినా కోలీవుడ్ లో మొదటిగా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర రాజేష్ కెరియర్ లో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వస్తుంది.ధనుష్, సూర్య, విక్రమ్ లాంటి స్టార్ హీరోలతో కూడా ఆడిపాడిన ఈ అమ్మడు మరో వైపు కథాబలం ఉన్న సినిమాలతో సోలోగా కూడా తనని తాను ఎలివేట్ చేసుకుంటుంది.

తమిళంలో లేడీ ఒరియాంటెడ్ సినిమాలు అంటే ముందుగా ఐశ్వర్య రాజేష్ పేరు వినిపించేంత గుర్తింపు తెచ్చుకుంది.ఆలస్యంగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఇక్కడ కూడా తన ముద్ర వేసుకునే ప్రయత్నం ఈ అమ్మడు చేస్తుంది.

ప్రస్తుతం తెలుగులో టక్ జగదీష్ సినిమాలో నానికి జోడీగా నటిస్తుంది.ఇదిలా ఉంటే ఐశ్వర్య రాజేష్ మరో విభిన్న కథతో తెరకెక్కుతున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతుంది.

Advertisement

ఐశ్వర్యరాజేష్‌ కథానాయికగా నటిస్తున్న మరో విభిన్న కథా చిత్రం భూమిక.రతీంద్రన్‌ ఆర్‌ ప్రసాద్‌ ఈ సినిమాతో దర్శకుడు పరిచయం అవుతున్నాడు.

కార్తిక్‌ సుబ్బరాజు సమర్పణలో కార్తికేయన్‌ సంతానమ్‌, సుధాన్‌ సుందరమ్‌, జయరామన్‌ నిర్మిస్తున్నారు.ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సోమవారం కథానాయిక తమన్నా ట్విట్టర్‌ ద్వారా విడుదలచేసింది.

అడవుల సంరక్షణ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది అని ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్ చూస్తూ ఉంటే తెలుస్తుంది.అరణ్యం మధ్యలో చెట్ల తీగలన్నీ ఐశ్వర్యరాజేష్‌ శరీరాన్ని పెనవేసుకొని ఉన్న ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఆమె కథానాయికగా నటిస్తోన్న 25వ చిత్రమిది.హారర్‌, థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతోంది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు