మహాత్మా గాంధీ గెటప్ లో కనిపిస్తున్న తెలుగు హీరో ఎవరో చెప్పుకోండి చూద్దాం..!

తెలుగులో ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించిన "అల్లుడు శీను" అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ మొదటి తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వచ్చీరావడంతోనే తన మొదటి చిత్రం అల్లుడు శీను తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికి తన తదుపరి చిత్రాల కథల విషయంలో కొంత అవగాహన లోపించడంతో తనకంటూ సినీ కెరియర్ లో సరైన హిట్ లేక కొంత మేర సతమతమవుతున్నాడు.

అయితే తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి సంబందించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్  మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఆ ఫోటోని పరిశీలించినట్లైతే చిన్నప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గాంధీ వేషధారణ వేసుకున్న సమయంలో తీసినట్లు  తెలుస్తోంది.

 దీనికి తోడు ఈ రోజుగాంధీ జయంతి కావడంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు. అంతేగాక ఈ ఫోటోని షేర్ చేసిన కొత్త కాలంలోనే దాదాపుగా లక్షల సంఖ్యలో లైకులు కామెంట్లు వచ్చాయి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించినటువంటి రాక్షసుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.దీంతో ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

Advertisement

 కాగా ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు కూడా ప్రారంభమయ్యాయి.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు