తెలుగు లస్ట్‌ స్టోరీస్‌ లో ఆ బోల్డ్‌ పాత్ర చేసేది ఎవరో తెలిసి పోయింది

బాలీవుడ్‌ ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ నిర్మించిన వెబ్‌ సిరీస్‌ లస్ట్‌ స్టోరీస్‌ సంచలన విజయాన్నిసొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

ఆ వెబ్‌ సిరీస్‌ ను ఇప్పుడు తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు.

నాలుగు ఎపిసోడ్‌ లుగా ఉండే ఆ వెబ్‌ సిరీస్‌ కు నలుగురు ప్రముఖ దర్శకులు దర్శకత్వం వహిస్తున్నారు.ఒక ఎపిసోడ్‌ కు మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

తెలుగు వర్షన్‌ లస్ట్‌ స్టోరీస్‌ లో తెలుగమ్మాయి ఈషా రెబ్బా కీలక పాత్రలో కనిపించబోతుంది.ఇక లస్ట్‌ స్టోరీస్‌ లో భర్తతో సుఖం పొందలేక మానసికంగా కృంగిపోతూ స్వయం తృప్తి కోసం ప్రాకులాడే ఒక వివాహిత పాత్ర ఉంటుంది.

ఆ పాత్రను హిందీలో కియారా అద్వానీ చేసింది.నటనకు ఆస్కారం ఉన్న ఆ పాత్ర వెబ్‌ సిరీస్ కు చాలా కీలకంగా ఉంటుంది.

Advertisement

ఆ పాత్రలో నటించడం వల్లే కియారా అద్వానీకి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది.అలాంటి పాత్రను తెలుగు హీరోయిన్స్‌ చేయాలంటే ఒప్పుకోవడం కష్టమే.

ఈషా రెబ్బా ఆ పాత్రను చేస్తుందని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.కాని తాజాగా ఈషా చేస్తున్నది మరో పాత్ర అని కియారా అద్వానీ చేసిన పాత్రను తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

తెలుగు మరియు తమిళంలో మంచి స్టార్‌ డం ఉన్న హీరోయిన్‌ శృతిహాసన్‌.ఆమె నటించడం వల్ల తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి ఆధరణ ఈ వెబ్‌ సిరీస్ కు లభించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

స్టార్‌ వారసురాలు అయిన శృతి హాసన్‌ ఆ పాత్రను చేయడం అంటే ఆయన్ను అవమానించినట్లే అంటూ కమల్‌ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.కాని మొదటి నుండే శృతి హాసన్‌ ఇలాంటి బోల్డ్‌ పాత్రలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది.తెలుగు లస్ట్‌ స్టోరీస్‌ లో కూడా శృతి బోల్డ్‌ గా ఆకట్టుకుంటుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతోంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు