దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఉంది చంద్రబాబు ధోరణి అని ఫైర్ అయిన విజయసాయి రెడ్డి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది.నిన్న మొన్నటి వరకు ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా విమర్శించుకున్న ఇరు వర్గాలు.

 Vijay Sai Reddy Comments On Chandrababunaidu, Vijay Saireddy, Chandrababu, Phone-TeluguStop.com

ఇప్పుడు కేంద్రాన్ని ముందు పెట్టి కొట్టుకుంటున్నారు.అధికారపక్షం వైసీపి ప్రతిపక్షంలో ఉన్న నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తుందని ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని దీనిపై వెంటనే కేంద్రం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న ప్రధానమంత్రికి లేఖ రాసిన విషయం అందరికీ తెలిసిందే.

ఈ అంశంపై చంద్రబాబుకి మద్దతుగా వైసీపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా అధికార పక్షంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఫోన్ టాపింగ్ అంశంపై ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది.

మంత్రి సుచరిత ప్రతిపక్షాలు ఫోన్ టాపింగ్ జరుగుతున్నట్లు సాక్షాలు తనకి అందిస్తే వెంటనే దీనికి కారణమైన వారిపై సీరియస్ గా స్పందించి తగు చర్యలు తీసుకుంటానని అన్నారు.ఇక తాజాగా ఈ అంశం పై వైసిపి రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ఫోన్ టాపింగ్ చేస్తున్నారని చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలపై ఫైర్ అవుతూ ఓ ట్వీట్ చేశారు.అదేంటో ఇప్పుడు చూద్దాం.

‘మనవాళ్లు బ్రీఫుడు మీ’ అన్న వాయిస్ మీదేనని పసిపిల్లలూ గుర్తుపట్టారు.నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఎవరిచ్చారని మీడియా ఇంటర్వ్యూల్లో గద్దించిన సంగతి ఎవరూ మర్చి పోలేదు.ఇజ్రాయిల్ ట్యాపింగ్ మిషన్ల కోసం కింద మీదా పడ్డట్టు వికీలీక్స్ బయట పెట్టింది.దొంగే దొంగ అనిఅర్చినట్టు లేదూ?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube