సారీ చెప్పి మరీ కూల్చేస్తున్న పూరీ

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఫైటర్ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా పూరీ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే సందేహం సర్వత్రా నెలకొంది.అయితే ఈ సినిమా షూటింగ్‌ను ఎక్కువగా ముంబైలోనే నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించినా కరోనా వైరస్ కారణంగా అది కుదరడం లేదు.

ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను హైదరాబాద్‌కు మార్చాలని పూరీ ఆలోచించాడు.అయితే ముంబైలోనే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ నిర్వహించాలని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ కోరాడట.

కానీ ముంబైలో పరిస్థితులు చేజారుతుండటంతో ఇప్పట్లో అక్కడ షూటింగ్ నిర్వహించలేమని తేల్చేసిన పూరీ, కరణ్‌కు సారీ చెప్పి హైదరాబాద్‌లో షూటింగ్‌కు సమాయత్తం అవుతున్నాడు.ఈ మేరకు ముంబైలో ఈ సినిమా షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన సెట్స్‌ను ఆయన కూల్చేయాల్సిందిగా ఆర్డర్ కూడా వేశాడట.

Advertisement

దీంతో బాలీవుడ్ జనాలు అవాక్కవుతున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే సరైనా నిర్ణయం అని వారు కొనియాడుతున్నారు.ఇక ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోండగా పురీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ-ఛార్మీ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు