బాలీవుడ్‌లోనే పాతుకుపోతున్న పూరీ.. మరి తెలుగు మాట ఏమిటయ్యా?

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇటీవల యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో కలిసి ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని తెరకెక్కించి అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ ఒక్క సినిమాతో పూరీ గతకొంత కాలంగా కోల్పోయిన క్రేజ్‌ను తిరిగి రాబట్టుకున్నాడు.

ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దడంలో పూరీ తనదైన మార్క్‌ను చూపించాడు.ఇక ఈ సినిమా తరువాత టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో తన తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఈ క్రేజీ డైరెక్టర్.

ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తున్నాడు పూరీ.కాగా ఈ సినిమాను బాలీవుడ్‌లో రిలీజ్ చేసేందుకు ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహర్ ముందుకు రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే నటిస్తుండటంతో ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.అయితే పూరీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విధానంతో పూర్తిగా ఇంప్రెస్ అయిన కరణ్ జోహర్, పూరీతో ఓ స్టన్నింగ్ డీల్ కుదుర్చుకున్నాడు.

Advertisement

తన నెక్ట్స్ రెండు చిత్రాలను బాలీవుడ్ హీరోలతో చేయాల్సిందిగా పూరీతో సైన్ చేయించుకున్నాడు ఈ టాప్ డైరెక్టర్.అదిరిపోయే ఆఫర్ కావడంతో పూరీ కూడా ఈ ఒప్పందానికి రెడీ అయ్యాడు.

అయితే విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తున్న సినిమా తెలుగు ఆడియెన్స్‌కు ఇప్పటికే తెలిసిన విషయం కాబట్టి, ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ప్రేక్షకులు అంటున్నారు.మరి పూరీ బాలీవుడ్ స్టార్స్‌తో తీయబోయే సినిమాలను తెలుగులో నేరుగా రిలీజ్ చేస్తారా లేక వేరే తెలుగు హీరోలతో ఆ సినిమాలను చేసి రిలీజ్ చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement

తాజా వార్తలు