లాక్‌డౌన్ తరువాత వకీల్ సాబ్ నెంబర్ వన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాతో పవన్ తన రీఎంట్రీని ఎంత పవర్‌ఫుల్‌గా ఇవ్వబోతున్నాడా అని ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా లెక్కలు వేస్తున్నారు.

కాగా ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు పవన్ రెడీ అయ్యాడు.అయితే ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

కానీ లాక్‌డౌన్ కారణంగా అది వాయిదా పడింది.ఇక ఈ సినిమా షూటింగ్ 90 శాతం పూర్తి కావడంతో కేవలం 10 శాతం మాత్రమే షూటింగ్ మిగిలి ఉంది.

కాగా లాక్‌డౌన్ నుండి షూటింగ్‌లకు సడలింపులు ఇవ్వడంతో సామాజిక దూరం పాటిస్తూ షూటింగ్ జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.దీంతో లాక్‌డౌన్ తరువాత సామాజిక దూరం పాటిస్తూ షూటింగ్ జరుపుకునేందుకు వకీల్ సాబ్ ముందు వరుసలో ఉన్నాడు.

Advertisement

ఈ సినిమాలో కేవలం కోర్టు సన్నివేశాలు మాత్రమే షూటింగ్ జరగాల్సి ఉందట.దీంతో ఈ సీన్స్‌లో కొంతమందితోనే షూటింగ్ ముగించేందుకు ఆస్కారం ఉందని చిత్ర యూనిట్ తెలిపింది.

అంటే లాక్‌డౌన్ తరువాత షూటింగ్ జరుపుకునేందుకు నెంబర్ వన్ స్థానంలో వకీల్ సాబ్ ఉన్నాడని చెప్పొచ్చు.ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు తెలుగు రీమేక్‌గా వకీల్ సాబ్ చిత్రం వస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు
Advertisement

తాజా వార్తలు