అంధుడికి వింత అనుభవం... కారు గుద్దగానే కంటిచూపు వచ్చేసింది.. !

మనం చాలా సినిమాల్లో హీరోలు, హీరోయిన్లు ప్రమాదాల్లో గతం మరిచిపోయి కొన్ని సంవత్సరాల తరువాత గతం గుర్తుకొచ్చిన సన్నివేశాలను చూస్తూ ఉంటాం.

కానీ నిజ జీవితంలో మాత్రం ఇలా జరిగే సందర్భాలు తక్కువగా ఉంటాయి.

కానీ అలాంటి సంఘటన నిజజీవితంలో జరిగింది.పోలాండ్లో నివశించే గోరాజ్ అనే అంధుడికి 20 సంవత్సరాల క్ర్తితం ఎడమ కన్ను పూర్తిగా కనిపించకుండా పోయింది.

గోరాజ్ కుడి కన్ను కూడా మసకమసకగా కనిపించేది.గోరాజ్ అతని చూపు కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగినా చికిత్స చేయటం వీలు కాదని చికిత్స చేసినా ఫలితం ఉండదని చెప్పటంతో గోరాజ్ ఒక అంధుడిగానే జీవనాన్ని సాగిస్తున్నాడు.

కానీ ఒక ఘోర ప్రమాదంలో అతను కోల్పోయిన కంటిచూపును తిరిగి పొందాడు.వేగంగా రోడ్డుపై వెళుతున్న కారు గోరాజ్ ను బలంగా ఢీ కొట్టగా తుంటి భాగానికి గాయాలయ్యాయి.

Advertisement

వైద్యులు అతని తుంటి భాగానికి చికిత్స అందించగా మెల్లమెల్లగా అతను కోలుకున్నాడు.చికిత్స తరువాత అతనికి కళ్లు కనపడటంతో పాటు వస్తువులను స్పష్టంగా చూడగలిగాడు.

ఈ విషయం తెలిసిన వైద్యులు వైద్య చరిత్రలోనే 20 సంవత్సరాల క్రితం చూపు కోల్పోయిన వ్యక్తికి చూపు తిరిగిరావడం అద్భుతం అని చెబుతున్నారు.తుంటి ఎముక చికిత్స కు అందించిన మందుల వలనే అతనికి కంటిచూపు వచ్చి ఉండవచ్చని కానీ అదే కారణమని ఖచ్చితంగా చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు.

గోరాజ్ ఏ ఆస్పత్రిలో కంటిచూపు పొందాడో అక్కడే అతనికి ఉద్యోగం కూడా వచ్చింది.అంధుడిగా ఉన్న గోరాజ్ కు మరలా చూపు రావడం నిజంగా అద్భుతమే అని నెటిజన్లు కామెంట్ల రూపంలో అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు
Advertisement

తాజా వార్తలు