బాలీవుడ్లో ధడక్ చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించినటువంటి స్వర్గీయ హీరోయిన్ శ్రీ దేవి కూతురు జాన్వీ కపూర్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే ప్రస్తుతం జాన్వి కపూర్ కి సంబంధించినటువంటి ఓ వార్త నట్టింట్లో బాగా హల్ చల్ చేస్తోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే తాజాగా ఈ అమ్మడు తనకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో తన అభిమానులతో పంచుకుంటుంది.
అయితే ఇందులో ఎక్కువగా తాను ఫిట్నెస్ కోసం జిమ్ కి వెళ్తున్న సమయంలో మరియు మరికొన్ని అయితే పని నుంచి బయటకు వచ్చిన సమయంలో తీసుకున్న ఫోటోలను పోస్ట్ చేసింది.
ఈ ఫోటోలో ఎక్కువగా జాన్వికపూర్ బుల్లి నిక్కర్ ని దరించి ఉండటంతో నెటిజన్లు ఆ ఫోటోలను దారుణంగా టూల్స్ చేస్తున్నారు.అంతేగాక ఎప్పుడూ బుల్లి బుల్లి నిక్కర్లేనా అప్పుడప్పుడు ప్యాంట్లు చీరలు వంటివి కూడా వేసుకొమ్మని సూచిస్తున్నారు.

అయితే గతంలో ఈ విషయంపై పై జాన్వీ కపూర్ ఘాటుగానే స్పందించింది.అంతేగాక ఎటువంటి బట్టలు ధరించాలో ఎటువంటి బట్టలు ధరించకూడదో తనకు బాగా తెలుసని ఇంకొకరు ఈ విషయం గురించి తనకు చెప్పనవసరం లేదని ఘాటుగా నెటిజన్లకు సమాధానమిచ్చారు.దీంతో మరింత రేచిపోయినటువంటి నెటిజన్లుమళ్లీ ఇలాంటి ఫోటోలపై పలు కామెంట్లు చేస్తున్నారు.అయితే జాన్వీ కపూర్ మాత్రం వీళ్ళు ఇక మారారని ఈ కామెంట్లను పట్టించుకోవడం మరియు వాటిపై స్పందించడం మానేసింది.
అయితే ప్రస్తుతం జాన్వికపూర్ బిజీ షెడ్యూల్ తో బిజీ బిజీగా గడుపుతోంది.తాజాగా గుంజన్ సక్సేనా రూహి ఆఫ్జనా, దోస్తానా వంటి చిత్రాల్లో నటిస్తోంది.







