స్టూడెంట్‌తో టీచరమ్మ జంప్ జిలానీ!

విద్యార్ధులకు విద్యాబుద్దులు చెప్పి వారిన ఉన్నతంగా తీర్చి దిద్దాల్సిన టీచర్లు కొన్నిసార్లు చేసే పనులకు అందరూ అవాక్కవుతుంటారు.

కాగా కొందరేమో మానవత్వం మరిచిపోయి విద్యార్ధులపై అత్యాచారాలకు పాల్పడుంటే, మరికొందరు వారిని విచక్షణా రహితంగా కొడుతుంటారు.

కానీ గుజరాత్‌కు చెందని ఓ టీచరమ్మ చేసిన పనికి సదరు విద్యార్ధి తల్లిదండ్రలు పోలీస్ స్టేషన్ చుట్టూ తమ బిడ్డ కోసం తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని ఓ స్కూల్‌లో 8వ తరగతి చుదువుతున్న విద్యార్ధితో చదువు చెప్పే టీచరమ్మ జంప్ అయ్యింది.

ఏడాదిగా వారిద్దరు చాలా సన్నిహితంగా ఉంటున్నారనే విషయం తెలుసుకున్న సదరు విద్యార్ది తండ్రి వారిని మందలించాడు.దీంతో ఆ టీచరమ్మ విద్యార్థితో పారిపోయింది.

తమ కొడుకును పట్టుకుని తమకు అప్పగించాలని ఆ విద్యార్ధి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.విద్యార్థితో టీచరమ్మ పారిపోయిన విషయంపై పోలీసులు స్పందించడానికి నిరాకరించారు.

Advertisement

కాగా ఫిర్యాదు చేసిన విద్యార్ధి తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగని వారు తెలిపారు.టీనేజ్ విద్యార్ధితో పారిపోయిన టీచరమ్మను వీలైనంత త్వరగా పట్టుకుంటామని వారు అన్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు