మాస్ మహారాజ్ తో మల్టీ స్టారర్ చేయాలి అంటున్న మెగా హీరో

మెగా ఫ్యామిలీ నీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు సాయి ధరమ్ తేజ్.

వరుసగా హ్యాట్రిక్ విజయాలతో కెరియర్ ని గ్రాండ్ గా ప్రారంభించి సాయి ధరమ్ తేజ్ కి ఆ తర్వాత ఊహించని విధంగా వరుసగా 5 ఫ్లాప్ లు వచ్చాయి.

కెరియర్ గాడితప్పిందని అనుకున్న సమయంలో చిత్రలహరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి క్లాసిక్ హిట్ ని ఖాతాలో ఏసుకున్నతేజ్ ని తాజాగా ప్రతి రోజు పండగే సినిమాతో ఫామిలీ హిట్ ఇచ్చింది.ఇప్పటి వరకు ఫామిలీ హీరోగా చేయని తేజ్ మారుతీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ఆ లోటు కూడా తీర్చుకున్నాడు.

ఇదిలా ఉంటే బాలకృష్ణ రూలర్ కి పోటీగా వచ్చిన ఈ సినిమా ఫామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యిందనే టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సాయి ధరమ్ తేజ్ తాజాగా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మల్టీ స్టారర్ చిత్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోలలో రవితేజ ఎనర్జీ పీక్స్ లో ఉంటుందని, మేమిద్దరం కలిసి చేస్తే బాగుంటుందని అన్నాడు.రవితేజ కూడా ఎప్పటి నుంచో ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దాం అని చెబుతున్నారని అయితే మా ఎనర్జీ లెవల్స్ కి సరిపోయే కథ వస్తే కచ్చితంగా తనతో మల్టీ స్టారర్ చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

అయితే హై వోల్టేజ్ ఎనర్జీతో పెర్ఫార్మెన్స్ చేసే ఇద్దరు మాస్ హీరోలని తీసుకొని అంతే ఎనర్జీతో సినిమాని నడిపించే విధంగా కథని ప్రస్తుతం ఉన్న దర్శకులలో ఎవరు తయారు చేయగలరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు