రెడ్డి రాజ్యంలో కక్ష రాజ్యం

ఇప్పటికే అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ రాంగోపాల్ వర్మ సంచలనాత్మకమైన సినిమాను విడుదల చేస్తుండగా ఇప్పుడు అదే టైటిల్ ను రకరకాలుగా వాడేసుకుంటున్నారు రాజకీయ నాయకులు.ముక్కుసూటిగా మాట్లాడుతూ అందరితోనూ విరోధం పెట్టుకుంటారు అనే పేరు ఉన్న మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి ఎప్పుడు ఏదో ఒక అంశం మీద స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు.

 Jc Diwakar Reddyon Ap Cm Jagan-TeluguStop.com

కొంతకాలంగా విఏసీపీ ప్రభుత్వాన్ని ఆయన విమర్శిస్తూనే ఉన్నారు.ఆయనకు చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఓ అధికారులు టార్గెట్ చేస్తున్నారు అంటూ వైసీపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నారు.

తాజాగా జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ ప్రభుత్వానికి రెడ్డి రాజ్యంలో కక్షరాజ్యం అని పేరు పెట్టాలని ఆయన అన్నారు.

జగన్ హయాంలో ఆయన తాత రాజారెడ్డి పాలన కొనసాగుతోందని, జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.నామినేటేడ్ పోస్టులు రెడ్లకు ఎక్కువగా ఇచ్చినందుకు సీఎం జగన్‌ను అభినందిస్తున్నానని అన్నారు జేసీ.

చంద్రబాబుకు అది చేతకాలేదన్నారు.చంద్రబాబు హయాంలో కమ్మలకు అన్యాయం జరిగిందన్నారు.

రాయలసీమ ప్రాజెక్టులపై అసెంబ్లీలో జగన్ బాగా మాట్లాడారని జేసీ దివాకర రెడ్డి అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube