అశ్వత్థామరెడ్డి కీలక నిర్ణయం జేఏసీ పదవికి రాజీనామా ?

సుదీర్ఘ కాలం పాటు సమ్మె చేసినా తమ సమస్యలకు ఒక పరిష్కారం రాకపోగా ఇప్పుడు అసలుకే ఎసరు రావడంతో ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గారు.

కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలంటూ సమ్మె బాట పట్టిన టీఎస్ఆర్టీసీ కార్మికులందరికీ నేతృత్వం వహించిన అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ జేఏసీ పదవికి రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ఆయన ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న సమయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో పాటు సొంత ప్రయోజనాలు కోసం ఎక్కువగా ప్రయత్నించి విమర్శలపాలయ్యారు.దీనిపైనే ఎక్కువ రాద్ధాంతం జరిగింది.

అంతేకాకుండా సమ్మె విరమణ సమయంలో కూడా ఏకపక్షంగానే నిర్ణయాలు తీసుకున్నారని ఆయన మీద విమర్శలు వచ్చాయి.దీంతో మనస్తాపానికి గురైన ఆయన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పదవి రాజీనామా చేసేందుకు సిద్ధం అయినట్టు తెలుస్తోంది.

bus.

Advertisement
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

తాజా వార్తలు